‘సరస్వతి పవర్‌’లో ప్రభుత్వ భూములున్నాయా? సమగ్ర నివేదిక కోరిన పవన్‌ కళ్యాణ్‌

పల్నాడు జిల్లా దాచేపల్లి, మాచవరం మండలాల్లో జగన్‌ కుటుంబానికి చెందిన సరస్వతి పవర్‌ సంస్థ భూముల్లో అటవీ భూములు ఏమైనా ఉన్నాయా అని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆరా తీశారు. అటవీ భూములుంటే.. ఎంత విస్తీర్ణంలో ఉన్నాయో నివేదిక ఇవ్వాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. సరస్వతి పవర్‌కు ఒక వెయ్యి 515.93 ఎకరాల్లో ప్రకృతి సంపద, వాగులు, వంకలు, కొండ భూములు ఉన్నాయని వార్తలు వెలువడిన నేపథ్యంలో ఈ అంశంపై వారితో ఆయన చర్చించారు. వాటిలో ప్రభుత్వ, అటవీ భూములు, జలవనరులు ఏ మేరకు ఉన్నాయో సమగ్రంగా పరిశీలించాలని స్పష్టం చేశారు. దీంతో పాటు పర్యావరణ అనుమతులు ఎలా పొందారో తెలియజేయాలని కాలుష్య నియంత్రణ మండలిని ఆదేశించారు. ఈ అంశాలపై అటవీ, రెవెన్యూ, పీసీబీ తదితర శాఖల ఉన్నతాధికారులతో త్వరలో సమీక్షించాలని పవన్‌ నిర్ణయించారు.

Latest Articles

ఫౌజీ వస్తున్నాడు.. మరి.. బాలయ్య..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ, క్రేజీ మూవీ ఫౌజీ. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఇన్ని రోజులు సస్పెన్స్ గా ఉండేది. ఇప్పుడు డిసెంబర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్