బ్రేకింగ్: టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఐడీ అధికారులు.. నోటీసులు

AP CID Notice |ఎన్నికలు దగ్గర పడే కొద్ది ఏపీలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నువ్వా నేనా అనే రీతిలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు నేతలు. ఈ క్రమంలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఏపీ సీఐడీ అధికారులు వెళ్లారు. టీడీపీ అనుబంధ పత్రిక చైతన్యరథంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన కథనాలపై టీడీపీ ప్రధాన కార్యదర్శి పేరుతో నోటీసులు అందజేశారు.

గతేడాది నవంబరు 23న చైతన్యరథం పత్రికలో మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డిపై వచ్చిన ఓ కథనంపై సీఐడీ అధికారులు నోటీసులు(AP CID Notice) అందించినట్లు సమాచారం. సీఐడీ నోటీసులపై టీడీపీ నేతలు స్పందిస్తూ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సీఐడీ అధికారులు నోటీసులు ఇవ్వడానికి వచ్చారని విమర్శించారు. చైతన్యరథనంలో బుగ్గనపై వచ్చిన ఆరోపణలు ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఇలాంటి నోటీసులతో టీడీపీని దెబ్బతీయలేరని పేర్కొన్నారు.

Read Also: హైదరాబాద్ లో బెట్టింగ్ ముఠాల గుట్టు రట్టు
Follow us on:  YoutubeInstagram Google News

Latest Articles

ఫౌజీ వస్తున్నాడు.. మరి.. బాలయ్య..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ, క్రేజీ మూవీ ఫౌజీ. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఇన్ని రోజులు సస్పెన్స్ గా ఉండేది. ఇప్పుడు డిసెంబర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్