స్వాతంత్రం తర్వాత అందుబాటులోకి రాబోతున్న మొదటి రైల్వే స్టేషన్ అది. హైదరాబాద్ తూర్పు ప్రాంతం అభి వృద్ధికి తోడ్పడే స్టేషనూ అదే. హైదరాబాద్ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చర్లపల్లి రైల్వే టెర్మినల్ మరికొద్దీ రోజుల్లో అందుబాటులోకి రాబోతుంది. 100 ఏళ్ల కిందట కట్టిన సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల తర్వాత ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతున్న అతి పెద్ద స్టేషన్గా చర్లపల్లి రైల్వే టెర్మినల్ రూపుదిద్దుకుం టుంది. అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త సదుపాయాలతో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న చర్లపల్లి రైల్వే టెర్మినల్.
హైదరాబాద్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న సికింద్రాబాద్ స్టేషన్ మీద ఒత్తిడి తగ్గించేం దుకు దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి రైల్వే టెర్మినల్కు శ్రీకారం చుట్టింది. రూ. 221 కోట్ల అంచనా ఖర్చుతో 2016లో ప్రారంభమైన టెర్మినల్ పనులు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి. పనులు ఒకవైపు కొనసాగుతున్నప్పటికీ రైళ్ల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది. లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, వెయిటింగ్ హాల్స్, వాటర్ ఇలా అన్ని రకాల సదుపాయాలతో ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడంలో రాజీ లేకుండా టెర్మినల్ను సిద్ధం చేస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే చెపుతోంది.
ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ద్వారా రోజుకు 250 పైగా రైళ్లు రాకపొకలు సాగిస్తుండగా లక్షా 50వేల మంది ప్రయాణం చేస్తున్నారు. సికింద్రాబాద్తో నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి స్టేషన్లు కలుకొని దాదాపు 3లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కేంద్రంగా చర్లపల్లి శాటిలైట్ రైల్వే స్టేషన్లను భారతీయ రైల్వే అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పటి వరకు రూ.300 కోట్ల వరకు టెర్మినల్ కోసం ఖర్చు కాగా, కేంద్రమే పూర్తి స్థాయిలో నిర్మిస్తోంది. సికింద్రాబాద్ రైల్వే పార్కింగ్ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని చర్లపల్లిలో పార్కింగ్కు ఎలాంటి ఇబ్బంది రాకుండా చేస్తోంది. ఒకేసారి 350 కార్లు, 500 వరకు టూ వీలర్లు పార్కింగ్ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు సీఎస్ఆర్.
వచ్చే నెల మొదటి వారంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చర్లపల్లి టెర్మినల్ను ప్రారంభిస్తారని బీజేపీ నేతలు చెప్తున్నారు. కొత్త టెర్మినల్ అందుబాటులోకి వస్తే ఘట్కేసర్, ఉప్పల్, ECIL, రాంపల్లి, మల్లాపూర్, చెంగిచర్ల, హైదరాబాద్ తూర్పు ప్రాంత ప్రజలకు చర్లపల్లి స్టేషన్ ఉపయోగంగా ఉంటుంది. చర్లపల్లి మీదుగా సికింద్రాబాద్ వెళ్లే రైళ్లు సికింద్రాబాద్లో ప్లాట్ ఫార్మ్ దొరకక అరగంట పైగా చర్లపల్లి స్టేషన్లోనే ఆగుతున్నాయి. ఇక నుంచి చర్లపల్లి టెర్మినల్ అందుబాటులోకి రావడంతో ప్రయాణికులకు ఆగే ఇబ్బంది ఉండదని రైల్వే అధికారులు చెపుతున్నారు. వరంగల్ హైవే నుంచి 6.5 కిలోమీటర్లు, ఔటర్ రింగు రోడ్డు నుంచి 5 కిలోమీటర్ల దూరంలో చర్లపల్లి టెర్మినల్ ఉంటుంది. టెర్మినల్కు చేరుకునే రోడ్డు మార్గాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి వివరించామని రైల్వే అధికారులు చెప్పారు. ఇక ఇప్పటికే చర్లపల్లిలో ఆగే ట్రైన్లు, అక్కడ స్టార్ట్ అయ్యే రైళ్ల వివరాలను దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
షాలీమర్-హైదరాబాద్, చెన్నై సెంట్రల్-హైదరాబాద్ ఎక్స్ప్రెస్, గోరఖ్పూర్-సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ రైళ్లు చర్లపల్లి స్టేషన్ నుంచి బయలుదేరుతాయి. దీని తోపాటు మరీకొన్ని రైళ్లకు దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి స్టేషన్లో హాల్టింగ్ ఇచ్చింది. హైదరాబాద్-సిర్పూర్, సికింద్రాబాద్-సిర్పూర్ వెళ్లే కాగజ్నగర్ ఎక్స్ ప్రెస్, గుంటూరు-సికింద్రాబాద్ వెళ్లే గోల్కొండ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్నగర్ భాగ్యనగర్ ఎక్స్ప్రెస్, విజయవాడ-సికింద్రాబాద్ శాతవాహన ఎక్స్ప్రెస్, గుంటూరు-సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ రైళ్లు ఇక నుంచి చర్లపల్లి స్టేషన్లో ఆగుతాయని భారతీయ రైల్వే ప్రకటించింది. రైళ్ల రాకపోకలతో పాటు టెర్మినల్లో ఏర్పాటు చేసిన 4 పిట్ లైన్స్లో ఒకేసారి 48 బోగీల రైళ్ల మెయింటేనెస్ జరుగుతాయి.