విశాఖపట్టణంలో జరుగుతున్న ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా పేర్గాంచిన ఎందరో పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, జగన్ కలుసుకున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను అంబానీకి జగన్ వివరించారు.
ముఖేష్ అంబానీని ఆప్యాయంగా పలకరించిన సీఎం జగన్మోహన్ రెడ్డి.. రెండు రోజుల పెట్టుబడిదారుల సదస్సు ప్రధాన ఉద్దేశాన్ని అంబానీకి తెలిపారు. రాష్ట్రంలో వీలైనంత వరకు పెట్టుబడులు పెట్టాలని కోరారు.
విశాఖలో పెట్టుబడిదారుల సదస్సును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఎందరో పారిశ్రామిక దిగ్గజాలను ఆహ్వానించింది. దాదాపు 2లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహిస్తోంది. ఈ సదస్సులో అంబానీతో ముచ్చిటిస్తున్న జగన్.
రాష్ట్రంలో రిలయన్స్ సంస్థ పెట్టబోయే పెట్టుబడులపై చర్చించుకుంటున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత అంబానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి
విశాఖపట్టణం పెట్టుబడిదారుల సదస్సులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డితో సమావేశమైన రిలయన్స్ సంస్థల అధినేత అంబానీ.. ఈ సందర్భంగా ఆలింగనం చేసుకున్న అంబానీ, జగన్.
1.పరీక్షకు హజరయ్యే అభ్యర్థులు కేవలం చెప్పులు మాత్రమే ధరించి రావల్సి వుంటుంది. బూట్లు, బెల్ట్ ధరించి వచ్చే అభ్యర్థులను పరీక్షా కేంద్రానికి అనుమతించబడదు.
2.ఉదయం 8.30 గంటల నుండి అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతింబడుతుంది....