ఓ చర్చి ప్రాంగణంలో 251 మంది చిన్నారులను కట్టుబానిసల్లా వినియోగించుకుంటూ పనులు చేయిస్తున్న అమాన వీయ ఘటన జింబాబ్వేలో వెలుగు చూసింది. రాజధాని హరారేకు 34 కిలోమీటర్ల దూరంలోని ఈ చర్చిలో పోలీసులు దాడులు నిర్వహించారు. మత బోధకుడిగా చెప్పుకొంటున్న ఇషామెల్ చొకురొంగెర్వ అనే వ్యక్తి మాటలకు ఆకర్షితులై వెయ్యి మందికి పైగా పురుషులు, మహిళలు చర్చి ప్రాంగణంలోనే బతుకీడుస్తున్నట్లు పోలీసులు చెప్పారు. అక్కడ 16 సమాధులను గుర్తించామని, వాటిలో ఏడు చిన్నారులవి కూడా ఉన్నట్లు తెలిపారు. చిన్నారులను అక్కడి నుంచి పోలీసులు తరలించే ప్రయత్నం చేయగా మహిళలు తీవ్రంగా ప్రతిఘటించారు. ఇషామెల్ చొకురొంగెర్వను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
జింబాబ్వేలో వెలుగులోకి అమానవీయ ఘటన
0
231
Previous article
Next article
Latest Articles
నేను బీఆర్ఎస్ కు దూరమవుతున్నానని… మల్లారెడ్డి వ్యాఖ్యలపై చర్చ
మేడ్చల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి వీడియో వైరల్ అయింది. ఒక కార్యకర్త పుట్టిన రోజు వేడుకల్లో మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్కు దూరమవుతున్నానని.. తనను మర్చిపోతున్నారని అన్నారు. స్వయంగా మల్లారెడ్డి...
- Advertisement -
- Advertisement -


