23.2 C
Hyderabad
Saturday, January 18, 2025
spot_img

నాంపల్లి కోర్టుకు పూచీకత్తు సమర్పించిన అల్లు అర్జున్

 

నటుడు అల్లు అర్జున్‌ శనివారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఆయన వెంట మామ చంద్రశేఖర్‌ రెడ్డి ఉన్నారు. ఇద్దరూ కలిసి కోర్టుకు వచ్చారు. బెయిల్ , పూచీకత్తు పత్రాలు న్యాయమూర్తికి సమర్పించారు. అనంతరం అక్కడి నుంచి జూబ్లిహిల్స్‌లోని ఆయన నివాసానికి అల్లు అర్జున్‌ వెళ్లిపోయారు.

డిసెంబర్‌ 4న సంధ్య థియేటర్‌ దగ్గర జరిగిన తొక్కిసలాటలో హీరో అల్లు అర్జున్‌కి శుక్రవారం నాంపల్లి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. బెయిల్‌ పిటిషన్‌పై గత నెల 30న వాదనలు పూర్తయ్యయి. శుక్రవారం ఈ పిటిషన్‌పై నాంపల్లి రెండో మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టు తీర్పును వెల్లడించింది. ఈ కేసులో ఏ11గా అల్లు అర్జున్‌ అప్పటి వరకు హైకోర్టు ఇచ్చిన మద్యంతర బెయిల్‌పై ఉన్నారు.  నాంపల్లి కోర్టు షరుతులతో కూడిన సాధారణ బెయిల్ ఇచ్చింది. ప్రతి ఆదివారం రెండు నెలల పాటు చిక్కడపల్లి పోలీసుల ముందు వ్యక్తిగతంగా హాజరుకావాలని షరతు విధించింది. హత్యకు, హత్యకు సంబంధించి అల్లు అర్జున్‌ పై పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు వర్తించవంటూ తాము చేసిన వాదనలతో న్యాయస్థానం ఏకీభించిందని అందుకే బెయిల్ మంజూరు చేసిందని అల్లు అర్జున్‌ తరపు న్యాయవాది తెలిపారు.

పుష్ప 2 రిలీజ్‌ డే రోజున సంథ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవంత్‌ అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Latest Articles

ప్రపంచ దేశాల ఆర్థిక సదస్సులో పాల్గొనననున్న చంద్రబాబు

దావోస్‌లో జరగనున్న వరల్డ్‌ ఎకనామిక్ ఫోరం 2025 సదస్సుకు ఏపీ బృందం హాజరుకానుంది. మేరకు ఏపీ నుంచి ప్రతినిధుల బృందం హాజరయ్యేందుకు ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. నాలుగు రోజులపాటు జరగనున్న...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్