విద్యార్ధులు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలి- నారా లోకేశ్‌

ఏపీలో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజన పథకాన్ని ప్రారంభించారు. మంత్రి నారా లోకేశ్‌ విజయవాడ పాయకాపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం కాలేజిలోని కెమిస్ట్రీ, ఫిజిక్స్‌ ల్యాబ్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ.. విద్యార్ధులు బాగా చదువుకొని.. మంచి ఉద్యోగం సంపాదించి, కుంటుంబాన్ని బాగా చూసుకోవాలని చెప్పారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.

మంగళగిరిలో 2019లో ఓడిపోయాను. కానీ పట్టుదలతో శ్రమించి రికార్డు స్థాయి మెజార్టీతో విజయం సాధించాను. జీవితంలో గెలుపు ఓటములు సహజమే. పరీక్షలు తప్పితే చాలా మంది విద్యార్ధులు సూసైడ్‌ చేసుకుంటున్నారు. స్టూడెంట్స్‌ ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలి. విద్యావ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచాలి. అందుకే ప్రముఖుల పేర్లతో పథకాలు ప్రారంభించాం. పుస్తకాల్లో ఆటలకు పురుషుల బొమ్మలు, ఇంటి పనులకు బాలికల బొమ్మలు ఉన్నాయి. పుస్తకాలల్లో ఈ అసమానతను తొలగించాలని అధికారులను ఆదేశించానని మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు.

 

Latest Articles

నేను బీఆర్ఎస్ కు దూరమవుతున్నానని… మల్లారెడ్డి వ్యాఖ్యలపై చర్చ

మేడ్చల్‌లో మాజీ మంత్రి మల్లారెడ్డి వీడియో వైరల్ అయింది. ఒక కార్యకర్త పుట్టిన రోజు వేడుకల్లో మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్‌కు దూరమవుతున్నానని.. తనను మర్చిపోతున్నారని అన్నారు. స్వయంగా మల్లారెడ్డి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్