వైసీపీ అధినేత జగన్ అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ఈ విస్తృత స్థాయి సమావేశంలో కీలక అంశాలపై చర్చిం చారు పార్టీ నేతలు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్ అధ్యక్షతన ఈ భేటీ జరిగింది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరూ ఈ భేటీకి హాజరయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో ఓటమిపై విశ్లేషించారు. అలాగే భవిష్యత్తులో పార్టీని బలోపేతం చేసే విషయంపై జగన్ నేతలకు దిశానిర్దేశం చేశారు.జగన్ ఓదర్పు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆ దిశగా సంకేతాలు ఇచ్చినట్టు సమాచారం. ఎన్నికల తర్వాత కార్యకర్తలపై దాడులు పెరిగాయిని జగన్ అన్నారు. కొంతమందిని అవమా నిస్తున్నారని, ఆస్తుల నష్టం చేస్తున్నారని అన్నారు. నష్టపోయిన కార్యకర్తలను తాను త్వరలో కలుస్తానని చెప్పారు.
జగన్ అధ్యక్షతన వైసీపీ విస్తృతస్థాయి సమావేశం
0
179
Previous article
Next article
Latest Articles
2027 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్ల జోరు
2027 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్ల జోరు కొనసాగింది. నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.6.51 లక్షల కోట్లు కాగా... ఇది గతేడాదితో పోలిస్తే 16.4 శాతం వృద్ధి రేటు నమోదైంది....
- Advertisement -
- Advertisement -


