స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో సభలు, సమావేశాలు పెట్టకూడదంటూ జీఓ జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్.1 ను హైకోర్టు కొట్టేసింది. ఈ జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు తీర్పు వెల్లడించింది. జీవో నెంబర్.1 కు వ్యతిరేకంగా వాదించిన పిటిషనర్లు… ‘ఈ రోడ్ షోలను కట్టడి చేసేలా జీవో ఉందని.. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే జీవో ఇచ్చారని.. పోలీస్ యాక్ట్ 30 కు భిన్నంగా జీవో జారీ చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ వాదనలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం జీవోను కొట్టేస్తూ తీర్పును వెలువరించింది.
ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. జీవో నంబర్.1 కొట్టివేత
0
466
Latest Articles
తగ్గిన గోల్డ్ ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,040 రూపాయలు తగ్గి.. రూ.1,51,690కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్రేట్ 950...
- Advertisement -
- Advertisement -


