అధిక వడ్డీ ఆశ చూపి 50 కోట్ల రూపాయలతో ఉడాయించిన సంఘటన మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో చోటుచేసుకుంది. నిందితుడు నాగరాజు పది రూపాయల వడ్డీ ఆశ చూపి ఒక్కొక్క వ్యక్తి వద్ద 5 లక్షల నుంచి 20 లక్షల పైన వసూడు చేశాడు. డబ్బులు ఇవ్వాలని అడిగితే మూడు నెలలుగా కనిపించకుండా పోయాడు. దీంతో బాధితులు మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సమస్య కొలిక్కి రాకపోవడంతో బాధితులు రాఘవేంద్ర నగర్లోని నాగరాజు ఇంటి ముందు ధర్నాకు దిగారు.