పంజాగుట్టలో ప్రభుత్వ ఉద్యోగికి హనీట్రాప్..ఫొటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేసిన మహిళ

హైదరాబాద్‌లోని పంజాగుట్ట(Panjagutta) లో ప్రభుత్వ ఉద్యోగిని లక్ష్యంగా చేసుకుని హనీ ట్రాప్‌కు పాల్పడిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫోటోలు, వీడియోలు , ఓయో రూమ్ స్లిప్‌లతో బ్లాక్‌మెయిల్ చేస్తూ మూడేళ్లుగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.

పోలీసుల వివరాల ప్రకారం, ఖైరతాబాద్‌( Khairatabad) కు చెందిన ఓ ఎల్‌డీసీ (Lower Division Clerk) అధికారిని మహిళ హనీ ట్రాప్‌లోకి దింపి, వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను ఆధారంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడింది. ఓయో గది బుకింగ్ స్లిప్‌లను చూపిస్తూ డబ్బులు ఇవ్వకపోతే విషయం బయటపెడతానని బెదిరించినట్లు గుర్తించారు.

దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన బాధితుడు చివరకు పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి మహిళను అరెస్ట్ చేశారు. నిందితురాలిని నిన్న సాయంత్రం కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌కు తరలించారు.

పోలీసులు ప్రస్తుతం ఆర్థిక లావాదేవీలు, ఫోన్ రికార్డులు , ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నారు.

Latest Articles

తెలంగాణ కేబినెట్ విస్తరణకు అడ్డేమిటి?

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి అప్పుడే రెండున్నరేళ్లు కావస్తోంది. కానీ ఇంతవరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గం పూర్తి స్థాయిలో భర్తీ కాలేదు. ఢిల్లీ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా క్యాబినెట్ విస్తరణపై ఇంకా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్