Former MLA Neeraja Reddy | ఏపీలోని కర్నూలు జిల్లా ఆలూరు మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి మృతి చెందారు. హైదరాబాద్ నుంచి కర్నూలు వస్తుండగా బీచుపల్లి వద్ద టైర్ పేలి… వారు ప్రయాణిస్తున్న ఫార్చునర్ కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నీరజారెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆమెను హుటాహుటిన కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో నీరజారెడ్డి చికిత్స పొందుతూ చనిపోయారు. ఈమె 2009లో ఆలూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఆలూరు బీజేపీ ఇంఛార్జ్ గా కొనసాగుతున్నారు. నీరజారెడ్డి మృతితో కుటుంబికులతోపాటు స్థానిక బీజేపీ నేతల్లో విషాదం నెలకొంది.
బ్రేకింగ్: రోడ్డు ప్రమాదంలో ఆలూరు మాజీ ఎమ్మెల్యే దుర్మరణం
0
309
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


