సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. పట్టణంలో ఐలాకు సంబంధించిన 1,599 గజాల స్థలంలో హైడ్రా చర్యలు చేపట్టింది. ఐలా స్థలానికి చుట్టూ కంచె వేస్తున్నారు హైడ్రా అధికారులు. ఐలా స్థలంలో ప్రహరీ గోడ, కన్యకా పరమేశ్వరి ఆలయ నిర్మాణ పనులను నిలిపివేశారు. అనంతరం చుట్టూ కంచె వేస్తున్నారు. నిన్న ఉదయమే ఈ స్థలంలో నిర్మిస్తున్న గుడిని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పరిశీలించారు. ఆలయ నిర్మాణానికి తన వంతు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే హామీ ఇచ్చిన మరుసటి రోజే ఆలయ నిర్మాణాన్ని నిలిపివేసింది హైడ్రా.
ఐలాకు సంబంధించిన 1,599 గజాల స్థలం చుట్టూ కంచె వేసిన హైడ్రా
0
39
Latest Articles
ధనుష్.. ప్లాన్ అదిరింది..
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
- Advertisement -
- Advertisement -


