టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో నిందితులకు సుప్రీంకోర్టులో ఊరట

టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసుపై నిందితులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వైసీపీ నేతలు జోగి రమేశ్‌, దేవినేని అవినాష్‌ సహా 24 మంది దాఖలు చేసిన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం విచారించింది. దేవినేని అవినాష్‌, జోగి రమేశ్‌ సహా 20 మందికి సర్వోన్నత న్యాయస్థానం ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఏపీ ప్రభుత్వం తరువు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. వాదనల అనంతరం జోగి రమేశ్‌, దేవినేని అవినాష్‌ దేశం విడిచి వెళ్లొద్దని సుప్రీం కోర్టు ఆదేశించింది. దర్యాప్తునకు సహకరించాల్సిందేనని స్పష్టం చేసింది. తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, జోగి రమేష్‌, దేవినేని అవినాష్‌ సహా 24 మందికి షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

Latest Articles

క్రిష్ ప్రయోగం ఫలించేనా..?

మంచి కథలు చెప్పాలని తపించే దర్శకుల్లో ఒకరు క్రిష్. ఈమధ్య వరుసగా ప్లాపులు రావడంతో కెరీర్లో బాగా వెనకబడ్డాడు. అనుష్కతో ఘాటీ సినిమా చేసిన తర్వాత ఇంత వరుకు క్రిష్ మూవీ ఎవరితో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్