25.9 C
Hyderabad
Monday, June 30, 2025
spot_img

వైసీపీ సోషల్‌ మీడియా దెబ్బ.. ఆస్పత్రిలో చేరిన నటుడు పృథ్వీ

వైసీపీ సోషల్ మీడియా దెబ్బకు నటుడు పృథ్వీ ఆస్పత్రిలో చేరారు. హైబీపీతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరడంతో వైద్యులు చికిత్స చేస్తున్నారు. రెండు రోజుల కిందట వైసీపీని టార్గెట్‌ చేస్తూ ‘లైలా’ సినిమా ఫంక్షన్‌లో పృథ్వీ చేసిన పొలిటికల్‌ కామెంట్స్‌పై పెద్ద దుమారమే రేగుతోంది. పృథ్వీ చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని.. సారీ చెప్పాలని వైసీపీ సోషల్‌ మీడియా లైలా బాయ్‌కాట్‌ హ్యాష్‌ ట్యాగ్‌ను ట్రెండింగ్‌ చేసింది. ప్రస్తుతం హాస్పిటల్‌ బెడ్‌పై పడుకొని పృథ్వీ చికిత్స తీసుకుంటున్న వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

అసలు ఏం జరిగింది..?

థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్ తో పాపులర్ అయిన పృథ్వీ లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. సినిమా ప్రారంభంలో 150 గొర్రెలు ఉండేవని.. సినిమా చివరికి వచ్చేసరికి 11 మాత్రమే మిగిలాయి.. అదేమిటో అంటూ వైసీపీపై సెటైర్లు వేశాడు. ఇదే ఫంక్షన్ కు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రజారాజ్యం ఇప్పుడు జనసేనలా రూపాంతరం చెందింది అంటూ ప్రసంగం చేసి సినిమా ఈవెంట్ ని కాస్తా.. పొలిటికల్ ఈవెంట్ కింద మార్చేశారు. ఇక ఇది విన్న వైసీపీకి ఎక్కడో కాలింది. సోషల్ మీడియాలో బాయ్ కాట్ లైలా అంటూ ట్యాగ్ లైన్ తో ట్రెండింగ్ చేయడం మొదలుపెట్టారు.

ఇప్పుడు ఏం చేయాలో అర్ధం కాక లైలా సినిమా నిర్మాత సాహు, హీరో విశ్వక్సేన్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇక ఇద్దరూ రంగంలోకి దిగి .. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పృథ్వీ కామెంట్స్ కి సినిమాకి సంబంధం లేదని చెప్పడం మొదలుపెట్టారు. పృథ్వీ మాట్లాడిన దానికి సోషల్ మీడియాలో వేల ట్వీట్స్ అంటే సినిమా ఎలా బతకాలి.. అని విశ్వక్సేన్ మొరపెట్టుకుంటున్నాడు. చాలా కష్టపడి సినిమా తీశాం.. ఈ వివాదం గురించి ఇంతటితో ముగిస్తున్నానని సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. తమ ప్రమేయం లేకుండా జరిగిన దానికి సినిమాని బలి చేయొద్దని వేడుకున్నాడు. తమకు ప్రమేయం లేకున్నా సారీ చెబుతున్నానని అన్నాడు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్వామని అన్నాడు.

కానీ వైసీపీ సోషల్‌ మీడియా యాక్టివిస్టులు మాత్రం సినీ నటుడు పృథ్వీకి చుక్కలు చూపిస్తున్నారు. లైలా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పృథ్వీ వైసీపీని కించపరిచేలా కామెంట్స్‌ చేశారంటూ ఆ పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బాయ్‌ కాట్‌ లైలా అంటూ సోషల్‌ మీడియాలో క్యాంపెయిన్‌ నడుపుతున్నాయి. ఇప్పటి వరకు ఎక్స్‌లో 1.25 లక్షల ట్వీట్లు వేశారు. పృథ్వీ క్షమాపణ చెప్పాలని కోరుతున్నారు.

సినిమా ఫంక్షన్లు, పొలిటికల్ ఈవెంట్ లను వేర్వేరుగా చూడాలి. రెండు రంగాల్లో ఉన్నవాళ్లు సందర్భానుసారంగా మాట్లాడాలి. అంతేకానీ ఎంటర్ టైన్ మెంట్ లో పొలిటికల్ కామెంట్స్ చేస్తే వాళ్లదేం పోతుంది.. పోయేదంతా నిర్మాతదే కదా. ఇక ఈ వివాదం పృథ్వీ క్షమాపణ చెప్పే వరకు ఆగేలా లేదు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్