రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచార ఘటనలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్ గా స్పందించారు. క్రిమినల్స్ కు కులం, మతం అనేవి ఉండవని పోలీసులకు ఎన్నిసార్లు చెప్పాలని ఫైరయ్యారు. పిఠాపురం పర్యటనలో ఉన్న ఆయన.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యాచారాలకు పాల్పడిన కేసుల్లో నిందితుల్ని అరెస్ట్ చేయడంలో కులం అడ్డొస్తోందా ? అని ప్రశ్నించారు. నేరం చేసిన వారు బయట తిరుగుతుంటే.. అధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు. ఎస్పీలు, అధికారులు..రాష్ట్రంలో శాంతి భద్రతలు ముఖ్యమన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. హోంమంత్రి అనిత రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలకు బాధ్యత వహించాలని డిప్యూటీ సీఎం పవన్ సూచించారు. హోంశాఖ కూడా తానే తీసుకోవాల్సిందన్న పవన్.. తానే హోంమంత్రిని అయ్యుంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు.
క్రిమినల్స్ కు కులం, మతం అనేవి ఉండవని పోలీసులకు ఎన్నిసార్లు చెప్పాలి- పవన్
0
122
Previous article
Next article
Latest Articles
ఆస్పత్రిలో పవన్ ను పరామర్శించా.. అక్కడ కూడా రాష్ట్ర అభివృద్ధి గురించే మాట్లాడారు- చంద్రబాబు
ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేలా కృషి చేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తుంగభద్ర గేట్లు కొట్టుకు పోతే 34 గేట్లు పునరుద్ధించామని చెప్పారు. 12...
- Advertisement -
- Advertisement -


