పల్నాడు జిల్లా దాచేపల్లి, మాచవరం మండలాల్లో జగన్ కుటుంబానికి చెందిన సరస్వతి పవర్ సంస్థ భూముల్లో అటవీ భూములు ఏమైనా ఉన్నాయా అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరా తీశారు. అటవీ భూములుంటే.. ఎంత విస్తీర్ణంలో ఉన్నాయో నివేదిక ఇవ్వాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. సరస్వతి పవర్కు ఒక వెయ్యి 515.93 ఎకరాల్లో ప్రకృతి సంపద, వాగులు, వంకలు, కొండ భూములు ఉన్నాయని వార్తలు వెలువడిన నేపథ్యంలో ఈ అంశంపై వారితో ఆయన చర్చించారు. వాటిలో ప్రభుత్వ, అటవీ భూములు, జలవనరులు ఏ మేరకు ఉన్నాయో సమగ్రంగా పరిశీలించాలని స్పష్టం చేశారు. దీంతో పాటు పర్యావరణ అనుమతులు ఎలా పొందారో తెలియజేయాలని కాలుష్య నియంత్రణ మండలిని ఆదేశించారు. ఈ అంశాలపై అటవీ, రెవెన్యూ, పీసీబీ తదితర శాఖల ఉన్నతాధికారులతో త్వరలో సమీక్షించాలని పవన్ నిర్ణయించారు.
‘సరస్వతి పవర్’లో ప్రభుత్వ భూములున్నాయా? సమగ్ర నివేదిక కోరిన పవన్ కళ్యాణ్
0
219
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


