పల్నాడు జిల్లా దాచేపల్లి, మాచవరం మండలాల్లో జగన్ కుటుంబానికి చెందిన సరస్వతి పవర్ సంస్థ భూముల్లో అటవీ భూములు ఏమైనా ఉన్నాయా అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరా తీశారు. అటవీ భూములుంటే.. ఎంత విస్తీర్ణంలో ఉన్నాయో నివేదిక ఇవ్వాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. సరస్వతి పవర్కు ఒక వెయ్యి 515.93 ఎకరాల్లో ప్రకృతి సంపద, వాగులు, వంకలు, కొండ భూములు ఉన్నాయని వార్తలు వెలువడిన నేపథ్యంలో ఈ అంశంపై వారితో ఆయన చర్చించారు. వాటిలో ప్రభుత్వ, అటవీ భూములు, జలవనరులు ఏ మేరకు ఉన్నాయో సమగ్రంగా పరిశీలించాలని స్పష్టం చేశారు. దీంతో పాటు పర్యావరణ అనుమతులు ఎలా పొందారో తెలియజేయాలని కాలుష్య నియంత్రణ మండలిని ఆదేశించారు. ఈ అంశాలపై అటవీ, రెవెన్యూ, పీసీబీ తదితర శాఖల ఉన్నతాధికారులతో త్వరలో సమీక్షించాలని పవన్ నిర్ణయించారు.
‘సరస్వతి పవర్’లో ప్రభుత్వ భూములున్నాయా? సమగ్ర నివేదిక కోరిన పవన్ కళ్యాణ్
0
192
Previous article
Latest Articles
కేంద్రానికి, సీబీఎస్ఈ బోర్డుకు కేటీఆర్ సూటి ప్రశ్నలు
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల వివాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మూల్యాంకనంలో అవకతవకలపై అటు కేంద్రాన్ని ఇటు సీబీఎస్ఈ బోర్డుని నిలదీశారు. న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్థులకు ఆయన మద్దతు...
- Advertisement -
- Advertisement -


