రైతు ఆత్మహత్య ఘటనపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఆరా తీశారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దు టూరు గ్రామానికి చెందిన రైతు బొజెడ్ల ప్రభాకర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన పొలాన్ని కబ్జా చేశారంటూ ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని మనస్తాపంతో సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభాకర్ ఆత్మహత్య ఘటనపై మంత్రి తుమ్మల స్పందించారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల ని రెవెన్యూ పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విచారణ జరిపి వెంటనే నివేదిక ప్రభుత్వానికి అందజేయా లని రెవిన్యూ పోలీస్ అధికారులను ఆదేశించారు. రైతులు పొలం పంచాయితీల కోసం ఆత్మహత్యలకు పాల్పడవద్దని మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో పొలం పంచాయితీలపై ప్రత్యేకంగా దృష్టి పెడతామని చెప్పారు. కాంగ్రెస్ పాలన లో రైతులకు న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు తుమ్మల.
రైతు ఆత్మహత్య ఘటనపై మంత్రి తుమ్మల ఆరా
0
158
Previous article
Next article
Latest Articles
ఆస్పత్రిలో పవన్ ను పరామర్శించా.. అక్కడ కూడా రాష్ట్ర అభివృద్ధి గురించే మాట్లాడారు- చంద్రబాబు
ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేలా కృషి చేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తుంగభద్ర గేట్లు కొట్టుకు పోతే 34 గేట్లు పునరుద్ధించామని చెప్పారు. 12...
- Advertisement -
- Advertisement -


