వేసవి సెలవులతోపాటు ఆదివారం సెలవు రోజు కావడంతో భద్రాద్రికి భక్తుల రద్దీ పెరిగింది. దీంతో రామ య్య దర్శనానికి భక్తులు పొటెత్తారు. వేలాది మంది భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి కూడా భక్తుల రద్దీ పెరగడంతో భక్తులకు ఉచిత దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుండగా ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది. వివిధ ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తుల రామనామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగుతోంది.రద్దీ దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా .. అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ ఈవో రమాదేవి.


