అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు. మరికొన్ని రోజుల్లో భారత్ ప్రధాన భూభాగంలోకి ప్రవేశించ నున్నాయి. దేశంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ఈ రుతుపవనాల కదలికలపై ఐఎండీ తాజా సమాచారాన్ని అందించింది. నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతంలోని కొన్ని భాగాల్లో విస్తరించాయని, దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, దక్షిణ అండమాన్ సముద్రం లోనూ ప్రవేశించాయని తెలిపింది. నైరుతి రుతుపవనాలు ముందుకు కదలడానికి అనుకూల పరిస్థితు లు నెలకొని ఉన్నాయని వివరించింది. మే 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, ఇది వాయవ్య దిశగా పయనించి మే 24 నాటికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని ఐఎండీ పేర్కొంది.
అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు
0
339
Previous article
Next article
Latest Articles
కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు..
మెగా హీరో వరుణ్ తేజ్ ఈమధ్య కాలంలో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. సరైన బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్న వరుణ్ ఈసారి రూటు మార్చి డిఫరెంట్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు....
- Advertisement -
- Advertisement -


