హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఆ సంస్థ గుడ్ న్యూస్ అందించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వేళ్లలో మార్పులు చేశారు. ఇప్పటి వరకు రాత్రి 11 గంటలకు చివరి రైలు అందుబాటులో ఉండగా, దీనిని మరో 45 నిమిషాలు పొడిగించారు. ఇకపై రాత్రి 11.45 గంటలకు చివరి రైలు అందు బాటులో ఉంటుంది. అలాగే, ప్రస్తుతం ఉదయం ఆరు గంటలకు తొలి రైలు అందుబాటులో ఉండగా, దాన్ని కూడా పొడిగించారు. ప్రతి సోమవారం 5.30 గంటలకే తొలి రైలు అందుబాటులో ఉంటుందని హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు తెలిపారు.


