తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయి స్టులు మృతిచెంది నట్టు తెలుస్తోంది. మృతుల్లో మావోయిస్టు ఆర్మీ చీఫ్ కమోండర్ అన్నే సంతోష్ అలియాస్ సాగర్ ఉన్నాడు.ఎన్కౌంటర్ సందర్భంగా ఒక ఏకే-47 గన్, పేలుడు పదార్థాలను పోలీసులు, భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ములుగు జిల్లా వెంకటాపురంలోని కర్రెగుట్ట ప్రాంతంలో భద్రతాబల గాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. అనంతరం, ఘటనా స్థలంలో ఏకే-47 సహా మరో మూడు తుపాకులను, పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. పరిసర ప్రాంతాల్లో గ్రేహౌండ్ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.


