ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు, ఢిల్లీ మంత్రి ఆతిశీకి ఎన్నికల కమిషన్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. బీజేపీలో చేరాలంటూ అత్యంత సన్నిహితుల ద్వారా ఆ పార్టీ తనను సంప్రదించిందంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై… సోమవారం మధ్యాహ్నంలోగా సరైన ఆధారాలు చూపించాలని కోరింది. ఈ విషయంపై కొద్దిరోజుల క్రితం బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. బీజేపీలో చేరిక విషయంలో చేసిన వ్యాఖ్యలను సమర్థిం చుకోవాలని, అందుకు తగిన ఆధారాలు ఉన్నాయని భావిస్తున్నాం. వాటిని ఈసీకి అందించాలని కోరుతు న్నామని ఈసీ తన నోటీసులో పేర్కొంది. దీనిపై స్పందించిన ఆతిశీ.. ఎన్నికల సంఘం బీజేపీకు అను బంధ సంస్థా? అంటూ ప్రశ్నలు గుప్పించారు. ఈ-మెయిల్ ద్వారా తనకు నోటీసులు అందడానికి గంట ముందే ఈ విషయం బీజేపీ నుంచి మీడియాకు తెలిసిందని ఆరోపించారు.


