దేశంలో కులగణన చరిత్ర

          భారతీయ సమాజంలో కులం అంతర్భాగం అంటారు సామాజిక శాస్త్రవేత్తలు. కులం అనేది సమాజంలోని వ్యక్తులను వివిధ సామాజిక దొంతరలుగా విభజించే ఓ వ్యవస్థ. భారతదేశంలాంటి దేశంలో కులాన్ని వేరుచేసి చూడ టం సాధ్యంకాని పని అంటారు సామాజిక శాస్త్రవేత్తలు. భారత ప్రభుత్వం పార్లమెంటులో తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం మూడు వేల కులాలు, పాతిక వేల ఉప కులాలున్నాయి. భారతదేశంలో కులగణనకు ఒక చారిత్రక ప్రాధాన్యం ఉంది. కులగణన ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని భారతీయ కుటుంబాల ఆర్థిక స్థితిగతులపై సమా చారం సేకరించడం ఒక లక్ష్యంగా పెట్టుకున్నాయి ప్రభుత్వాలు. 1941లో కూడా కులగణన చేయాలని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించి సేకరించింది. అయితే రెండో ప్రపంచ యుద్ధం వల్ల ఆ సమాచారాన్ని బయటపెట్టలేక పోయింది.

     మనదేశంలో 1951 నుంచి 2011 వరకు ప్రతి జనాభా గణనలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు సంబంధిం చిన సమాచారం సేకరించి ప్రచురించారు. దేశవ్యాప్తంగా వెనుకబడిన తరగతులు వాస్తవానికి 1881 నుంచి 1931వరకు కుల ఆధారిత జనగణన జరిగింది. దేశవ్యాప్తంగా బీసీలు 52 శాతం ఉన్నారన్న మండల్ కమిషన్ రిపోర్ట్ కూడా 1931 నాటి కులగణన ఆధారంగా చెప్పినదే. రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదనే నిబంధనను దృష్టిలో పెట్టుకునే ఓబీసీ లకు 27 శాతం రిజర్వేషన్లను మండల్ కమిషన్ సిఫారసు చేసింది. నేషనల్ శాంపిల్ సర్వే 2011-12 ప్రకారం అగ్రకులా లతో పోల్చినప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీలు చాలా వెనుకబడి ఉన్నారని తెలుస్తోంది.

       కులం ఆధారంగా జరిగే జనాభా లెక్కల సేకరణను రాజ్యాంగం నూటికి నూరుశాతం సమ ర్థించింది.ఆర్టికల్ 340 ప్రకారం సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల పరిస్థితులను పరిశోధించడానికి అలాగే ప్రభుత్వాలు తీసుకోవలసిన చర్యలకు సంబంధించి సిఫార్సులు చేయడానికి ఒక కమిషన్‌ను నియమించాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే కులగణనపై భారతీయ జనతా పార్టీ మాటమార్చడం దేశ మంతా చూసింది. 2018లో పార్లమెంటు వేదికగా అప్పటి రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ మాట్లాడుతూ త్వరలో జరగబోయే జనగణనలో కులగణనను తప్ప కుండా చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం కులగణనను బీజేపీ వ్యతిరేకిస్తోంది. రాబోయో జనాభా లెక్కల సేకరణను ఓబీసీల కులగణన చేయలేమని 2021లో పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా 2023లో బీహార్ రాష్ట్రం కులగణనలో రికార్డు సృష్టించింది.

     కులగణనకు అనేక అవాంతరాలు, అవరోధాలు అడ్డువచ్చినా ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్ పట్టిం చుకోలేదు. అవాంతరాలు, అవరోధాలను దాటుకుంటూ కులగణనను విజయవంతంగా పూర్తి చేశారు. మొత్తానికి దేశంలో కులగణన చేసిన తొలి రాష్ట్రంగా బీహార్ పేరు నమోదు చేసుకుంది. కులగణన చేసి ఫలితాలను ప్రచురించింది. మొత్తం బీహార్ జనాభాలో 63 శాతం మంది వెనుకబడిన తరగతులవారు న్నారని ఈ కులగణన స్పష్టం చేసింది. బీహార్‌లో జరిగిన కులగణన స్ఫూర్తితో మనదేశంలోని అనేక రాష్ట్రాలు కులగణనకు జై కొట్టాయి. ఏమైనా, సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించడానికి వెనుకబడిన తరగ తుల జనాభా లెక్కలు అవసరం అంటున్నారు సోషల్ సైంటిస్టులు. కులం ఆధారిత జనాభా లెక్కలు తీయడం వల్ల వనరుల సమాన పంపిణీ నిర్థారించడం సులువు అవుతుందంటున్నారు. మొత్తంమీద బీసీ లెక్కలు తేలితే, సామాజిక అసమానతలు పరిష్కరించడం సాధ్యమవుతుందన్నది మేధావుల అభి ప్రాయం.

Latest Articles

హీరో విజయ్‌ దేవరకొండకు TCA లీగల్ నోటీసులు

హీరో విజయ్‌ దేవరకొండకు తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ లీగల్ నోటీసులు పంపింది. HCA టీజీ20 లీగ్‌ను ప్రమోట్‌ చేయడంపై నోటీసులు ఇచ్చింది.  HCA టీజీ20 లీగ్‌కు బీసీసీఐ అనుమతి లేదని TCA పేర్కొంది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్