నంద్యాల జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో మూఢనమ్మకాలను మాత్రం ప్రజలు నమ్ముతూనే ఉన్నారు. ఆళ్లగడ్డ మండ లంలోని పలు గ్రామాలలో రాత్రి సమయాలలో క్షుద్ర పూజలు యధావిధిగా జరుగుతూనే ఉన్నాయి. రెడ్డిపల్లెలో క్షుద్ర పూజల కలకలం రేపాయి. రెడ్డిపల్లె, తువ్వ పల్లి గ్రామాల మధ్య ఉన్న స్మశా నం సమీపంలో ఉన్న రోడ్డుపై క్షుద్ర పూజలు జరిగాయి. క్షుద్ర పూజలు జరిగిన చోట నిమ్మకాయలు, పసుపు- కుంకుమ, మద్యం సీసాలు, తినుబండారాలు, మల్లె పూలు, ముగ్గులు, వేసి ఉన్నాయి. అర్ధరాత్రి సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రజలు సంచరించే మార్గమధ్యలో ఇలా క్షుద్ర పూజలు చేయడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. రోజురోజుకు మండలంలోని కొన్ని గ్రామాలలో క్షుద్ర పూజలు జరుగుతూ ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు రాత్రి సమయాలలో బయటకు రావడానికి భయపడుతున్నారు. క్షుద్ర పూజలు జరిపి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న వారిని గుర్తించి అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
నంద్యాల జిల్లా రెడ్డిపల్లెలో క్షుద్రపూజల కలకలం
0
513
Previous article
Latest Articles
అమెరికా – ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం
అమెరికా - ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఒప్పంద పత్రాలపై అమెరికా, ఇరాన్ దేశాల అధ్యక్షులు సంతకాలు చేశారు. ఒప్పందంలో 14 కీలక అంశాలు ఉన్నాయి. యుద్ధం మొదలైన మూడున్నర...
- Advertisement -
- Advertisement -


