28.7 C
Hyderabad
Thursday, May 7, 2026
spot_img

ప్రయాణికులకు ముఖ్య గమనిక.. ఆ రూట్లో వెళ్లే వందే భారత్ రద్దు..!

స్వతంత్ర వెబ్ డెస్క్: విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌ వెళ్లాల్సిన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌(Vande Bharat Express)ను నేడు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. గురువారం ఉదయం 5.45కి బయల్దేరాల్సిన రైలును సాంకేతిక కారణాలతో రద్దు చేసినట్లు చెప్పారు. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామన్నారు. వందేభారత్ రద్దు సమాచారాన్ని ఉదయం 5 గంటల నుంచి ప్రయాణికులకు చేరవేసినట్లు తెలిపారు. ప్రత్యామ్నాయంగా ఉదయం 7 గంటలకు మరో రైలును ఏర్పాటు చేశామని.. వందేభారత్‌ స్టాపుల్లోనే అది ఆగుతుందని తెలిపారు. వందేభారత్‌ రద్దుతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

సికింద్రాబాద్‌- విశాఖ వందేభారత్‌ కూడా..
మరోవైపు సికింద్రాబాద్‌ నుంచి ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ బయల్దేరాల్సిన వందేభారత్‌ కూడా రద్దయింది. సాంకేతిక కారణాలతో దాని స్థానంలో ప్రత్యామ్నాయ రైలును ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే ప్రయాణికులకు చేరవేశామని తెలిపింది. ఒకవేళ టికెట్‌ను రద్దు చేసుకుంటే ఆ మొత్తాన్ని పూర్తిగా రీఫండ్‌ చేస్తామని స్పష్టం చేసింది. వందేభారత్‌కు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన ఈ రైలులో వెళ్లే ప్రయాణికులకు టికెట్‌ ధరలో వ్యత్యాసం ఉన్న మొత్తాన్ని చెల్లిస్తామని తెలిపింది. వందేభారత్‌లో ఉండే విధంగానే ఈ రైలులోనూ క్యాటరింగ్‌ సదుపాయం కల్పిస్తామని పేర్కొంది.

Latest Articles

కవిత టార్గెట్ అన్న కేటీఆరేనా?

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కుటుంబ పోరు ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది. కొత్త పార్టీ పెట్టిన కవితను ఏమాత్రం పట్టించుకోవద్దని, ఎవరెవరో వస్తుంటారు పోతుంటారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ కేడర్‌కు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్