నష్ట పరిహారం ఎవరికి కావలె.. ఉన్న భూములు కోల్పోకుండా చూస్తే చాలు..!

స్వతంత్ర వెబ్ డెస్క్: నాగ్ పూర్ – అమరావతి గ్రీన్​ఫీల్డ్​హైవే అలైన్​మెంట్(Greenfield Highway Alignment)​ మార్చాలని డిమాండ్​చేస్తూ రఘునాథపాలెం(Raghunathapalem), చింతకాని(Chintakani) మండలాల్లోని గ్రామాల రైతులు ఖమ్మం(Khammam) కలెక్టరేట్​ముందు ఆందోళనకు దిగారు. హైదరాబాద్​ కోకాపేట ఎకరం రూ.100 కోట్లు పలుకుతోందని గొప్పలు చెబుతున్న కేసీఆర్(KCR), తమ భూములకు కేవలం ఎకరాకు రూ.25లక్షలు నష్ట పరిహారం ఇస్తామనడం దారుణం అన్నారు. తమ మొరను ఆలకించని కేసీఆర్ కు రైతుల ఉసురు తగులుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి పరిహారం వద్దని, భూములు కోల్పోకుండా చూస్తే చాలని చెప్పారు. రైతులకు అఖిల పక్ష పార్టీల నాయకులు మద్దతు తెలిపి కలెక్టరేట్ ను ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

ఈ క్రమంలో కొంత ఉద్రిక్తత నెలకొంది. సీపీఎం(CPM) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం( Tammineni Veerabhadram), సీపీఐ(CPI) రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు(Koonanneni Sambasivarao) మాట్లాడుతూ.. పోలీస్​బందోబస్తు నడుమ సర్వే చేసి, బలవంతంగా భూములు లాక్కోవడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొరివి నుంచి కోదాడకు, కోదాడ నుంచి అమరావతికి బ్రహ్మాండమైన రోడ్డు ఉందని, కొత్త హైవేతో ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పారు. కేవలం 12, 13 కిలోమీటర్లు దూరం తగ్గుతుందని, ఇంత మంది రైతులకు అన్యాయం చేస్తారా అని ప్రశ్నించారు.

Latest Articles

జెత్వానీ కేసులో కూటమి సర్కార్‌కు షాక్‌

ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో కూటమి సర్కార్‌కు షాక్‌ తగిలింది. సీఐడీ స‌మ‌ర్పించిన చార్జిషీట్‌లో దిమ్మ‌తిరిగే వాస్త‌వాలు బయటకు వచ్చాయి. జెత్వానే అతి పెద్ద బ్లాక్‌మెయిల‌ర్ అని సీఐడీ తేల్చింది. విజయ‌వాడ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్