స్వతంత్ర, వెబ్ డెస్క్: ఇటీవల మలయాళంలో భారీ విజయాలు సాధించిన సినిమాల జాబితాలో ‘2018’ ఒకటి. ఈనెల 5న కేరళలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్బాస్టర్ టాక్ అందుకుంది. కేరళలో 2018 సంవత్సరంలో వచ్చిన వరదల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తక్కువ బడ్జెట్ లో నిర్మించిన ఈ మూవీ తెలుగులో కూడా మంచి వసూళ్లు రాబట్టుతోంది. మే 26న ఇక్కడ రిలీజ్ అయి కేవలం నాలుగు రోజుల్లోనే రూ.4 కోట్లను వసూలు చేసింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను సోనీ లీవ్ సంస్థ దక్కించుకుంది. దీంతో జూన్ 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. టోవినో థామస్, కుంచాకో బోబన్, అపర్ణ బాలమురళి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి ఆంటోని జోసెఫ్ దర్శకత్వం వహించాడు.
‘2018’ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?
0
353
Latest Articles
క్షమాపణ చెబుతారని అనుకన్నా.. కానీ డైవర్షన్ చేస్తున్నారు- స్పీకర్
అసెంబ్లీ దగ్గర నిన్న జరిగిన ఘటనపై సభలో క్షమాపణ చెబుతారని అనుకున్నానని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. చిట్చాట్లో మాట్లాడిన ఆయన.. వాస్తవానికి మైక్ ఇవ్వద్దు.. తాను స్పీకర్గా నాలుగు వైపుల...
- Advertisement -
- Advertisement -


