స్వతంత్ర, వెబ్ డెస్క్: ఇటీవల మలయాళంలో భారీ విజయాలు సాధించిన సినిమాల జాబితాలో ‘2018’ ఒకటి. ఈనెల 5న కేరళలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్బాస్టర్ టాక్ అందుకుంది. కేరళలో 2018 సంవత్సరంలో వచ్చిన వరదల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తక్కువ బడ్జెట్ లో నిర్మించిన ఈ మూవీ తెలుగులో కూడా మంచి వసూళ్లు రాబట్టుతోంది. మే 26న ఇక్కడ రిలీజ్ అయి కేవలం నాలుగు రోజుల్లోనే రూ.4 కోట్లను వసూలు చేసింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను సోనీ లీవ్ సంస్థ దక్కించుకుంది. దీంతో జూన్ 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. టోవినో థామస్, కుంచాకో బోబన్, అపర్ణ బాలమురళి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి ఆంటోని జోసెఫ్ దర్శకత్వం వహించాడు.
‘2018’ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?
0
303
Latest Articles
BREAKING: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు షాక్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు షాక్ రేపటి జనసేన సభకు అనుమతి నిరాకరించిన పోలీసులు రేపు తెలంగాణలో పార్టీ నవ నిర్మాణ సంకల్ప సభ ప్లాన్ చేసుకున్న జనసేన మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9...
- Advertisement -
- Advertisement -


