స్వతంత్ర, వెబ్ డెస్క్: నిజామాబాద్ జిల్లా శివారులో పోలీసులు మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు దొంగలు తప్పించుకోబోతున్న సమయంలో కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లాలో ట్రాన్స్ఫార్మర్ నుండి కాయిన్స్ దొంగలిస్తున్న ముఠాపై పోలీసులు నిఘా పెట్టారు. పక్కా సమాచారంతో గత రాత్రి వాహనాలు తనిఖీ చేస్తుండగా పోలీసుల వాహనాన్ని ఢీ కొట్టి దుండగులు పరారయ్యారు. కారులో పరారవుతున్న దుండగలపై పోలీసులు మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో వారి వాహనాన్ని వదిలేసి దొంగలు తప్పించుకుపోయారు. వీరు రాజస్థాన్ కి చెందిన వారిగా పోలీసులు అనుమానిస్తున్నారు.