స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఆంధ్ర ప్రదేశ్: శ్రామికులంటే బానిసలు కాదన్నారు మంత్రి గుమ్మనూరు జయరాం. ప్రపంచ కార్మికులంతా ఏకమై తమ హక్కులు సాధించుకున్న రోజు మేడే అని గుర్తుచేశారు. కార్మిక, కర్షక సోదర, సోదరీమణులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని కోట్లాది మంది కార్మికులు, వారి కుటుంబాల సంక్షేమమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. కార్మికుల శ్రేయస్సు కోరే ప్రభుత్వం.. వైసీపీ ప్రభుత్వమని అన్నారు.