వైభవంగా స్వామివారి కళ్యాణం
కోనసీమ జిల్లా అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణం, రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. వేడుకను తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. ఆలయ అనువంశిక ధర్మకర్త శ్రీ రాజా కలిదిండి కుమార రామ గోపాల రాజా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
జనసంద్రమైన వన జాతర
తెలంగాణ కుంభమేళ మేడారం వన జాతర జనసంద్రమైంది. లక్షలాదిగా భక్తులు జాతరకు తరలివస్తు న్నారు. సమ్మక్క తనయుడు జంపన్నను గిరిజన సంప్రదాయాల మధ్య గద్దెపై ప్రతిష్టించగా అశేషంగా తరలివచ్చిన భక్తులు ఈ వేడుకను చూసి తరించారు. ఈనెల 21 నుండి 24 వరకు జాతర జరగనుంది.
బాహుబలి వంటివారు మోదీ
దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ హ్యట్రిక్ విజయం సాధించడం తధ్యమన్నారు బిజెపి నేతలు. జిల్లా కేంద్రం నిర్మల్ శివాజీ చౌక్ వద్ద విజయసంకల్ప యాత్రలో మాట్లాడిన నేతలు రెండున్నర దశాబ్దాల రాజకీయ ప్రయాణంలో మచ్చలేని నాయకుడు ప్రధాని మోడీ అని గుర్తు చేసారు. బాహుబలి లాంటి నరేంద్ర మోడీని ఓడించడం ప్రతిపక్షాల వల్ల సాధ్యం కాదంటూ ధీమా వ్యక్తం చేసారు.
నిమ్మలకు ఢోకా లేదు
రానున్న ఎన్నికల్లో పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఘన విజయం సాధించడం తధ్యమ న్నారు నియోజకవర్గ టిడిపి నేత కోడి విజయభాస్కర్. రైతు పోరుబాట పాదయాత్రలో ఎమ్మెల్యేకు లభించిన ఆదరణే ఇందుకు నిదర్శనమన్నారు. అనునిత్యం ప్రజలతో మమేకం కావడం ప్రజాప్రతినిధిగా ఆయనకున్న మరో లక్షణంగా పేర్కొన్నారు.
రూపాయి కట్నంతో వివాహం
రూపాయి కట్నంతో కుమారుడి వివాహం జరిపించారు హర్యానా రాష్ట్ర బీజెపీ ప్రధాన కార్యదర్శి కృష్ణ చౌకర్. సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న తన కుమారుడ్ని హర్యానా రాష్ట్ర స్టాప్ సెలక్షన్ ఛైర్మన్ భూపాల్ సింగ్ కాదరీ కుమార్తె గరిమాతో పెళ్లి జరిపించారు. వరుడికి భూపాల్ సింగ్ కట్నం ఇవ్వజూపగా దాన్ని వరుడి తండ్రి చౌకర్ నిరాకరించి, సంచిలోంచి రూపాయి తీసుకుని మిగిలిన మొత్తాన్ని వెనక్కి ఇచ్చారు. వరకట్నం సమాజానికి శాపమంటూ చౌకర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
యూజర్లకు హెచ్చరిక
యూజర్లకు ఐ ఫోన్ సంస్థ హెచ్చరిక జారీ చేసింది. సెల్ఫోన్ నీటిలో పడితే తడిపోవడానికి బియ్యం సంచిలో పెట్టడం లాంటి పనులు చేయొద్దని సూచించింది. అలా చేస్తే సమస్య మరింత జఠిలమౌ తోందని హెచ్చరించింది. కాగా ఐఫోన్ కొత్తగా కొనుగోలు చేసిన యూజర్లు ఈ సమస్య లేదని, 20 అడుగుల నీటిలో 30 నిమిషాల పాటు ఉన్నా పనిచేసే సామర్థ్యం ఐఫోన్లకు ఉంటోందని వెల్లడించింది.
విలాసవంతమైన హోటల్ వేదికగా…
ఒక శునకం పుట్టినరోజు వేడుకకు మరో 30 అతిధి శునకాలు హాజరయ్యాయి. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన ఆకాంక్ష రాయ్ తన శునకానికి జరిపిన ఈ హడావుడికి సిటీలోని డైనర్స్ అనే విలాసవంతమైన హోటల్ వేదికైంది. హ్యాండ్సమ్ పేరు గల ఈ శునకంకు ఇంట్లో తొలుత ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గణేష్ ఆలయానికి తీసుకెళ్లి అర్చన చేయించారు. డాగ్ పార్లర్కు తీసుకెళ్లి ప్రత్యేక ఆలంకరణ అనంతరం కేక్ కట్ చేయించడం విశేషం.
రైస్ మిల్లులపై దాడులు
వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండలంలోని పలు రైస్ మిల్లులపై సివిల్ సప్లై అధికారులు దాడులు నిర్వహించారు. మండల కేంద్రంలోని వీరభద్ర రైస్ మిల్లులో లెక్కకు తగ్గట్టు ధాన్యం లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. బియ్యంలోని వ్యత్యాసాలపై మిల్ యాజమాన్యంపై కేసు నమోదు చేయనున్నట్లు డిఎం వరప్రసాదరావు తెలిపారు.
సైబర్ మోసగాళ్ళు
పార్ట్ టైం జాబ్స్ పేరిట 41 లక్షల రూపాయల మేర సైబర్ మోసానికి ఒడిగట్టారు ఇద్దరు వ్యక్తులు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. నకిలీ ఐడీ క్రియేట్ చేసి వీరు ఈ మోసాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు అమీన్పూర్ పోలీసులు.
ఆటో ఢీ – వ్యక్తి మృతి
వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దాసు అనే వ్యక్తి మృతి చెందాడు. మహావీర్ హాస్పిటల్ లో విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నక్రమంలో ఆటో ఢీ కొనడంతో అక్కడి కక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
విద్యార్ధి అదృశ్యం
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధి బాలాజీ నగర్ చెందిన 14 ఏళ్ల మనోహర్ అదృశ్య మయ్యాడు. 9వ తరగతి చదువుతున్న మనోహర్ స్నేహితున్ని కలిసేందుకు బైటకి వెళ్లి తిరిగి రాకపో వడంతో కుటుంబసభ్యుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. విద్యార్థి తండ్రి స్వర్ణంరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు అమీన్పూర్ పోలీసులు.
బండ రాళ్ళతో…
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల RTA చెక్ పోస్ట్ సమీపంలో వ్యక్తి హత్యకు గురయ్యాడు. తలపై బండ రాళ్ళతో మోది దుండగులు ఈ హత్యకు పాల్పడ్డారు. స్ధానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇద్దరు మహిళలు మిస్సింగ్
భార్య, వదిన కనిపించడంలేదంటూ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీసులకు ఫిర్యాదు అందింది. పట్టణంలోని ముదిరాజ్ బస్తికి చెందిన లోకేష్ కుమార్ కు భార్య వర్ష తో తగవులు ఉన్నాయి. ఈ విషయమై ఇరువురికి సర్ధిచెప్పింది వదిన పావని. అయితే ఉదయం చూసేసరికి భార్య వర్ష, వదిన పావని ఇద్దరు కనిపించలేదంటూ లోకేష్ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు.
అనుమానాస్పద మృతి
బాపట్ల జిల్లా చీరాల రైల్వే స్టేషన్ ఎదుట ఉన్న సాయికృష్ణ లాడ్జి భవనం పై నుండి కిందపడి వ్యక్తి మృతి చెందిన ఘటన సంచలనం రేపింది. మృతుడు భీమవరం వ్యవసాయశాఖలో పనిచేస్తున్న అటెండర్ 42 ఏళ్ల కరుణకుమార్ గా గుర్తించారు. వేటపాలెంలో జరిగే శుభకార్యానికి హజరయ్యేందుకు కరుణ కుమార్ చీరాలకు వచ్చినట్లు తెలుస్తోంది. పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి విచారణ చేపట్టారు
హత్యాయత్నం కేసు
పత్రికా ఫోటో గ్రాఫర్ శ్రీకృష్ణపై దాడి కేసులో అనంతపురం పోలీసులు మిద్దె ఎర్రిస్వామిని అరెస్టు చేసి హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. దాడి ఘటనకు కారకులుగా ఆరుగుర్ని గుర్తించినట్లు చెప్పిన ఎస్పీ వీరికై ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు చెప్పారు.
జట్టులో స్వల్ప మార్పులు
ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా 2-1 ఆధిక్యంలో ఉన్న భారత జట్టు కీలకమైన నాలుగో టెస్ట్కు సన్నద్ధ మౌతోంది. శుక్రవారం రాంచీ వేదికగా జరగనున్న నాల్గో టెస్ట్లో ఆడే భారత్ జట్టులో బీసీసీఐ స్వల్ప మార్పులు చేసింది. బౌలర్ బుమ్రాకు ఈ టెస్ట్ నుంచి విశ్రాంతి నిచ్చింది. గాయం కారణంగా రెండు, మూడు టెస్ట్లకు దూరంగా ఉన్న కేఎల్ రాహుల్ ఈ నాల్గో టెస్టుకు దూరంగా ఉండనుండగా, ముకేశ్ కుమార్ కు నాల్గో టెస్టులో స్ధానం కల్పించింది బిసీసీఐ.