Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

మైలవరం నియోజకవర్గంలో నెగ్గేదెవరు?

రాజకీయాల్లో హత్యలే తప్ప ఆత్మహత్యలు ఉండవనే నానుడి మైలవరం నియోజకవర్గం కాబోతున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ అభ్యర్థి ఓడిపోతే నాయకులే కారణమనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. స్థానిక నాయకులు, బూత్ కన్వీనర్ల స్వార్థం పార్టీకీ నష్టం కలిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రచారంలో సమన్వయ లోపంతో పాటు పోల్ మేనేజ్‌మెంట్ చేయడంలో కూడా నిర్లక్ష్యం కొట్టేచినట్లు కనిపించింది. అధిష్టానం తీరుపై కూడా విమర్శలు వస్తున్నాయి. కొత్త అభ్యర్థిని పెట్టి అందుకు అవసరమైన యంత్రాం గం ఏర్పాటు చేయలేదని నాయకులే అంటున్నారు. ఓటర్లకు తాయిలాల పంపిణీ విషయంలో ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. వైసీపీ నాయకుల తీరుతో కూటమి అభ్యర్థి వసంత గెలుస్తాడా లేక ప్రభుత్వ పాజిటివ్ ఓటు బ్యాంకుతో వైసీపీ అభ్యర్థి గెలుస్తాడా వేచి చూడాలి.

మైలవరం నియోజకవర్గం నుంచి వైసీపీ అధిష్టానం సామాజిక సమీకారణాల నేపథ్యంలో…యాదవ సామాజిక వర్గానికి చెందిన జడ్పీటీసీ సర్నాల తిరుపతిరావుకు అవకాశం కల్పించింది. 2019 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి వసంత వెంకట కృష్ణప్రసాద్ 12వేల 747 ఓట్ల మెజార్టీతో గెలిచారు. కృష ప్రసాద్‌కు లక్షా 14వేల 940 ఓట్లు రాగ టీడీపీ అభ్యర్థి దేవినేని ఉమాకు లక్షా 2వేల 287 ఓట్లు వచ్చాయి. అప్పుడు 82.9 శాతం వరకు పోలింగ్ నమోదు అయింది. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా వసంత వెంకట కృష్ణప్రసాద్ పోటీ చేస్తుండగా, వైసీపీ నుంచి సర్నాల తిరుపతిరావు పోటీ చేస్తున్నారు. ఇద్దరూ ప్రచారంలో హోరాహోరీ చేశారు. ఇప్పుడు 85.36 శాతం వరకు పోలింగ్ జరిగిన నేపథ్యంలో ఎవరూ గెలుస్తారో తెలియని పరిస్థితి ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకే పడిందని టీడీపీ నేతలు అంటుంటే, ప్రభుత్వ సంక్షేమ పథకాలు తమకు కలిసి వస్తాయని వైసీపీ నాయకులు అంటున్నారు.

అధికార వైసీపీలో కొంతమంది నాయకుల స్వార్థం వల్ల పార్టీకీ నష్టం జరిగే అవకాశం లేకపోలేదనే వాదనలూ బలంగా వినిపిస్తున్నాయి. కొంతమంది పార్టీలో ఉంటూ ప్రతిపక్ష పార్టీకీ పని చేసినట్లు కూడా తెలుస్తోంది. వైసీపీలో ఉండి కూడా అంటి ముట్టనట్లు ఉన్నారనే ప్రచారం లేకపోలేదు. పార్టీ పదవుల్లో కూడా ఉండి నష్టం చేయడంఫై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బాధ్యతలు తీసుకున్న నాయకులు కూడా స్వార్థం కోసం తప్ప పార్టీ కోసం పని చేయలేదనే వాదనలు లేకపోలేదు. చేస్తే నాకేంటి అని కూడా నాయకులు మాట్లాడిన సందర్బాలు కూడా ఉన్నాయి. టీడీపీ నాయకులు ఐక్యంగా పని చేస్తే అధికార వైసీపీలో డబ్బులు ఇస్తే తప్ప కదిలే పరిస్థితి లేకుండా పోయుంది. పార్టీ అధికారంలోకి వస్తే ఉపయోగం ఉంటదనే విషయం వదిలేసి స్వల్ప ప్రయోజనం కోసం పాకులాడటం పార్టీకీ నష్టం జరిగే అవకాశం ఉంది. చాలా మంది నాయకుల్లో అదే ధోరణి ఉండటం ఆ ప్రభావం ఎన్నికల్లో తప్పకుండా పడే అవకాశం ఉంది.

ఇక వైసీపీ అభ్యర్థి నియోజకవర్గంలో కొత్త కావడంతో ఎన్నికల ప్రచారంలో వెనుకబడిన మాట వాస్తవం. నియోజకవర్గ వ్యాప్తంగా ఈ ప్రభావం లేకపోలేదు. బూత్ స్థాయిలో పూర్తి స్థాయిలో ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గ వ్యాప్తంగా సక్రమంగా సమన్వయం చేసే సరైనా నాయకుడు లేకపోవడం కూడా నష్టం జరిగే అవకాశం కూడా పోలింగ్‌పై పడినట్లు తెలుస్తోంది. టీడీపీ అభ్యర్థి వసంత గతంలో తనకు ఉన్న అనుభవంతో మొదటి నుంచి ప్రచారంలో దూసుకుపోయారు. ప్రచార విషయంలో వైసీపీ మాత్రం వెనుకబాటే కనిపించింది. రెడ్డిగూడెం, మైలవరం, జి. కొండూరు మండలాలు పూర్తిగా గ్రామీణ ప్రాంతాలు. ఇక్కడ రెండు పార్టీలు కూడా పోటాపోటీగా ఉంటాయి. కొన్ని గ్రామాల్లో మినహా పోల్‌ మేనేజ్‌మెంట్ బాగానే చేశారు. ఇబ్రహీంపట్నం మండలంలో కొండపల్లి మున్సిపాలిటీ, రూరల్ గ్రామాలు కలిపితే 85 వేలకు పైగా ఓటింగ్ ఉంది. ఇక్కడ పోల్ మేనేజ్‌మెంట్‌లో నాయకుల వైఫల్యం కనిపిస్తోంది. కొండపల్లి బూత్‌లో నాయకులు పని చేసిన ఇబ్రహీంపట్నంలో రెండు, మూడు బూత్‌లు, రూరల్‌లో రెండు, మూడు గ్రామాలు మినహా ఎక్కడ కూడా నాయకులు సరిగా పని చేయలేదనే వాదనలు వాళ్ల పార్టీ నాయకుల నుంచే వినిపించాయి. పోలింగ్ స్టేషన్ వద్ద ప్రచారం చేసే వాళ్ళు కానీ, ఓటర్లను తరలించే విధానంలో నాయకులు నిర్లక్ష్యం చేశారు.

టీడీపీ నాయకులు బూత్‌లో పోల్ మేనేజ్‌మెంట్‌పై ప్రధానంగా దృష్టి పెడితే వైసీపీలో బూత్ ఏజెంట్‌కి, బూత్ కన్వీనర్‌కీ మధ్య అసలు సమన్వయం లేదు. ఎవరు ఓటు వేశారో ఎవరు వేయలేదో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఇబ్రహీంపట్నంలో నాయకత్వ సమస్య కొట్టోచినట్లు కనిపించింది. ప్రతిపక్ష టీడీపీ నాయకులు మాత్రం పోలింగ్ ప్రారంభం నుంచి ముగిసే వరకు పోల్ మేనేజ్‌మెంట్ పైనే దృష్టి పెట్టి పని చేశారు. అవకాశం ఉన్నంత వరకు పోల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అధికార పార్టీలో తాయిలాల పంపిణీలో పూర్తి వైఫల్యం ఉంది. అధిష్టానం బయట వ్యక్తుల ద్వారా డబ్బులు పంపిణీ చేయడం లోపం అంటుంటే కాదు కాదు బూత్ స్థాయి నాయకులు కూడా చేతివాటం చేసినట్లు కూడా తెలుస్తోంది. కొండపల్లి మున్సిపాలిటీ ఇబ్రహీంపట్నంలో డబ్బుల పంపిణీలో అధికార వైసీపీ నాయకులు చేతివాటం ప్రదర్శన చేసినట్లు తెలుస్తోంది. కొంత మంది బూత్ కన్వీనర్లు చేసిన పొరపాట్ల వల్ల ఓటర్ల నుంచి విమర్శలు వచ్చాయి. వచ్చిన డబ్బులు పంపిణీ చేయకుండా నాయకులు మింగినట్లు ఓటర్లు అంటున్నారు. కొంతమందికి ఇవ్వకపోవడం తీవ్ర విమర్శలు వచ్చాయి. బూత్ కన్వీనర్లకు ఎన్నికల ఖర్చులకు 55వేల వరకు ఇచ్చిన పంపిణీలో కూడా చేతివాటం చేయడం పోలింగ్‌పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. దాని వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది.

ప్రచారం, పోల్ మేనేజ్‌మెంట్ వైఫల్యం కనబడుతుంటే, మరోవైపు వైసీపీ అగ్ర నాయకత్వంపై నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొత్త అభ్యర్థి సర్నాల తిరుపతిరావును ప్రకటించి అందుకు తగిన విధంగా తోడ్పాటు ఇవ్వలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. కొత్త ప్రాంతం వారిని ఇన్‌ఛార్జ్‌లుగా పెట్టడం వారికి ఇక్కడ పట్టు లేకపోవడం కూడా లోపమే. వారు పూర్తి స్థాయిలో క్యాడర్‌ను పనిలో పెట్టలేకపోయారనే ప్రచారం కూడా ఉంది. ఎన్నికల్లో జరిగే పొరపాట్లు సరిదిద్దుకునే అవకాశం కూడా ఉండదు. స్థానికత కలిసి వచ్చి గెలిస్తే తప్ప, ఓడిపోతే మాత్రం నాయకులు వైఫల్యం, పోల్ మేనేజ్‌మెంట్‌లో నిర్లక్ష్యం, ఇబ్రహీంపట్నం, రూరల్ గ్రామాలు, విజయవాడ రూరల్ గ్రామాలు ఓటమికి కారణం కావొచ్చని రాజకీయంగా చర్చ నడుస్తోంది.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్