ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీకి లోక్సభ ఎంపిక సవాల్గా మారింది. మిత్ర పక్షాలతో కలిసి మోదీ సర్కార్ కొలువు దీరిన వేళ లోక్సభ స్పీకర్ ఎన్నిక మిగిలి ఉండటంతో ఆ పదవి ఎవరికి వరిస్తుందన్న ఉత్కంఠ నెలకొంది. మరోపక్క టీడీపీ తన అభ్యర్థిని నిలబెడితే మద్దతు ఇచ్చేం దుకు ఇండియా కూటమి రెడీ అంటోంది. మరి ఇలాంటి పరిణామాల మధ్య స్పీకర్ పదవి ఎవరిని వరిస్తుంది..? ఎవరు ఎవరికి మద్దతిస్తారు..?
భాగస్వామ్య పార్టీలతో కలిసి మూడోసారి కేంద్రంలో అధికార పగ్గాలు చేజిక్కించుకున్నారు కమలనాథులు. దీంతో మరోసారి మోదీ ప్రభుత్వం కొలువు తీరింది. మంత్రులకు శాఖలు కేటాయించడంతో వారంతా బాధ్యతలు స్వీకరించి తమ విధులు నిర్వర్తించడంలో మునిగిపోయారు. అయితే,.. అత్యంత గౌరవ ప్రదమైన లోకసభ స్పీకర్ పదవి మాత్రమే మిగిలి ఉండటంతో ఆ పదవి అందరినీ ఊరిస్తోంది. ముఖ్యం గా అధిక స్థానాలు దక్కించుకుని బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో కీలకమైన టీడీపీ, జేడీయూ పార్టీల అధినేత లు ఈ పదవిపై కన్నేశారు. మరోపక్క బీజేపీ కూడా ఈ పదవిని వదలుకునేందుకు సిద్ధంగా లేదన్న టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ నుంచి పురందేశ్వరికి ఛాన్స్ ఇవ్కొచ్చు అన్న వార్త కూడా వైరల్ అవుతోంది. మరి ఇలాంటి పరిణామాల మధ్య ఏన్డీఏ కూటమి నుంచి స్పీకర్ పదవి ఎవరిని వరిస్తుంది..? బీజేపీ హైకమాండ్ దృష్టిలో ఉన్నదెవరు అన్న ప్రశ్నలు పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారగా.. సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
మరోపక్క స్పీకర్ ఎంపికపై ఇండియా కూటమి మిత్రపక్షమైన శివసేన నేత సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేయగా చంద్రబాబుకి ఆఫర్ ఇస్తూ వ్యాఖ్యానించడం పొలిటికల్ హీట్ను పెంచింది. తెలుగుదేశం పార్టీ లోక్సభ స్పీకర్ అభ్యర్థిని బరిలో నిలిపితే తాము మద్దతు ఇస్తామని ఆయన ప్రకటించారు. ఒక్క తామే కాదు. ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్ష పార్టీలన్నీ టీడీపీకి మద్దుతుగా ఉంటామని తెలిపారు. స్పీకర్ పదవి తమకు ఇవ్వాలని బీజేపీ పెద్దలను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కోరినట్టు తమకు తెలిసిందని, చంద్రబాబు డిమాండ్కు బీజేపీ పెద్దలు మద్దతు ఇవ్వకుంటే తాము ఇచ్చేందుకు సిద్దమని స్పష్టం చేశారు రౌత్. 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు చేసిందని, అయితే ప్రస్తుతం బీజేపీకి ఆ పరిస్థితి లేదని విమర్శించారు. స్పీకర్ పదవిని మిత్ర పక్షాలపైన టీడీపీ, జేడీయూ, లోక్ జనశక్తి పార్టీలకు ఇవ్వకపోతే ఆ పార్టీలను చీల్చే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు సంజయ్ రౌత్.
మరోవైపు అధికార పార్టీనే స్పీకర్ పదవికి అర్హత ఉంటుందని, ఆ పార్టీదే తొలి హక్కు అన్నారు జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగి. ఈ సందర్భంగా ఇండియా కూటమి డిమాండ్లు, ప్రకటనలు అభ్యంతరకరం గా ఉన్నాయని విమర్శలు గుప్పించారు. ఎన్డీయేలో బీజేపీ అతిపెద్ద పార్టీ అని తాము నమ్ముతున్నామని, ఆ పదవిపై బీజేపీ, ఎన్డీయే కూటమికి మొదటి హక్కు ఉంటుందన్నారు. తాను గత 35 సంవత్సరాలుగా ఎన్డీయేలో ఉన్నానని, జనతాదళ్ను విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ ఎప్పుడూ ప్రయత్నించలేదని, టీడీపీ, జేడీయూ కీలక పాత్ర పోషించాయన్నారు.ఇక ఇలాంటి పరిణామాల మధ్య రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇంట్లో నిర్వహించిన బీజేపీ రహస్య సమావేశంపై చర్చ సాగుతోంది. ఈ భేటీకి జేపీ నడ్డా, అశ్వనీ వైష్ణవ్, కిరణ్ రిజిజు, లాలన్ సింగ్, చిరాగ్ పాశ్వాన్ హాజరవగా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అభ్యర్థితో పాటు ప్రతిపక్ష పార్టీలను ఆకర్షించే వ్యూహంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం కేబినెట్లో కొన్ని కీలక శాఖలతోపాటు లోక్సభ స్పీకర్ పదవిని తమకు కేటాయించాలని బీజేపీ పెద్దలను ఎన్డీయే భాగస్వామ్య పక్షాల అధినేతలు కోరినట్లు సమాచారం. ఆ క్రమంలో వివిధ కీలక మంత్రి పదవులతో పాటు లోక్సభ స్పీకర్ పదవిని తమ వద్దే ఉంచుకుంటామని వారికి బీజేపీ అగ్రనేతలు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అందుకు ఎన్డీయే భాగస్వామ్య పక్షాలన్నీ అంగీకరించినట్లు తెలుస్తుంది. ఇలా మొత్తానికి లోక్సభ స్పీకర్ ఎంపిక రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. మరి సభకు అత్యంత గౌరవ ప్రదమైన ఈ పదవి ఎవరిని వరిస్తుందో ఎవరు ఆ పీఠాన్ని అధిరోహిస్తారో వేచి చూడాలి మరి.