మైనారిటీల అభివృద్ధికోసం కోటా ఇస్తామని విపక్షాలు అంటున్నాయని, యువత ఏమై పోతారని ప్రధాని నిలదీశారు. టెండర్లలోనూ మైనారిటీలకు రిజర్వేషన్ లు ఇచ్చేందుకువారు సిద్ధమవు తున్నారని మోదీ ఆరోపించారు. ఓ బ్రిడ్జి నిర్మించాలంటే, వారి ట్రాక్ రికార్డ్, అనుభవం, సాధన సంప త్తులు చూసి టెండర్ ఇస్తారని. వాటిలోనూ మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తే, బ్రిడ్జి కూలితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రధాని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కోసం పోరాటం