28.2 C
Hyderabad
Monday, February 17, 2025
spot_img

ప్రవళిక కుటుంబంలో ఒకరికి ఉద్యోగమిచ్చి ఆదుకుంటాం- మంత్రి కేటీఆర్

స్వతంత్ర వెబ్ డెస్క్: ఇటీవల ప్రవళిక అనే యువతి ఆత్మహత్య రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. మొదటగా గ్రూప్-2 వాయిదా పడటం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు కథనాలు వచ్చాయి. కానీ పోలీసులు మాత్రం ప్రేమ వ్యవహారం వల్లే ఈ అఘాయిత్యానికి పాల్పడిందని చెప్పారు. అయితే తాజాగా ప్రవళిక తల్లిదండ్రులు.. తమ కుమార్తెను ఓ యువకుడు వేధించేవాడని.. అతడి వేధింపులు తట్టుకోలేక తాను బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు.

అయితే ప్రవళిక ఆత్మహత్యపై ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్​లు తీవ్రంగా స్పందించాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు.. ఆమెది ఆత్మహత్య కాదని.. ఇది ప్రభుత్వం చేసిన హత్యేనని ఆరోపించాయి. మరోవైపు యువతి మరణాన్ని రాజకీయం చేయొద్దంటూ బీఆర్ఎస్ హితవు పలికింది. అయితే తాజాగా కరీంనగర్​లో పర్యటించిన మంత్రి కేటీఆర్ ఈ వ్యవహారంపై స్పందించారు.

“ప్రవళిక మృతిని కూడా రాజకీయం చేశారు. ప్రవళిక కుటుంబసభ్యులు నా దగ్గరకు వచ్చారు.. న్యాయం చేయాలని కోరారు. ప్రవళిక కుటుంబాన్ని ఆదుకుంటాం. వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తాం. అంతే కాకుండా ఆ అమ్మాయిని వేధించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇలాంటి ఘటనలు జరగకుండా ముందుగా జాగ్రత్తపడతాం.” అని కేటీఆర్ తెలిపారు.

Latest Articles

చైనాను శత్రుదేశంగా చూడొద్దన్న శామ్ పిట్రోడా

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శామ్ పిట్రోడా మరోసారి హాట్‌ టాపిక్ అయ్యారు. చైనా పట్ల భారతదేశం అనుసరిస్తున్న వైఖరి గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. చైనాను శత్రువులా భారతదేశం చూడకూడదని శామ్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్