సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాల ఉత్సవాల్లో ప్రతిష్టాత్మకమైన ఘట్టం రంగం ముగిసింది. పచ్చి కుండపై నిలబడి మాతంగి స్వర్ణలత అమ్మవారి ఆవహింపుతో భవిష్యవాణి వినిపించారు. తాను సంతోషంతో రాలేదని.. క్రోధంతో ఇక్కడికి వచ్చానని చెప్పారు. భక్తులు తాను చెప్పింది అనుసరించట్లేదని.. తాను ఎందుకు పలకాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీ ఏడాది లాగే ఈ ఏడాది కుంభవృష్టి వర్షాలు కురుస్తాయన్నారు. అయితే వరదల్లో జనాలు కొట్టుకుపోయే అవకాశముందని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అగ్నిప్రమాదాలు కూడా జరుగుతాయని అప్రమత్తత అవసరమని పేర్కొన్నారు. జనాలు వావివరసలు లేకుండా ప్రవర్తిస్తారని తెలిపారు. తన విగ్రహ ప్రతిష్ఠ చేస్తానని చెప్పి.. మాట తప్పారని ఆగ్రహించారు. భవిష్యవాణి వినేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు.
వరదల్లో జనాలు కొట్టుకుపోయే పరిస్థితి.. భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత
0
11
Previous article
Latest Articles
బీహార్ బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం
బీహార్ బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం సాధించారు. బీజేపీ సిట్టింగ్ స్థానంలో ప్రశాంత్ కిషోర్ గెలిచారు. వరుసగా 8 సార్లు గెలిచిన బీజేపీ సిట్టింగ్ స్థానంలో జన్...
- Advertisement -
- Advertisement -


