తెలంగాణ రాజకీయాల్లో క్షుద్ర పూజల వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. హరీశ్ రావు క్షుద్రపూజలు చేస్తున్నారని మహేశ్కుమార్ గౌడ్ ఆరోపిస్తే… కాదు రేవంత్ రెడ్డే క్షుద్రపూజలు చేస్తున్నారని దాసోజు శ్రవణ్ కౌంటరిచ్చారు. వర్షాలు పడకూడదని, పంటలు పండకూడదని, ప్రజలు కరువుతో అల్లాడి పోవాలని కుతంత్రాలు చేస్తున్నారని మహేశ్ గౌడ్ ఆరోపించారు. తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచే అఘోర, తాంత్రిక పూజలు చేయడం వారికి అలవాటుగా ఉందని ఆరోపణలు చేశారు. ఇక కాంగ్రెస్ నేతల ఆరోపణలకు బీఆర్ఎస్ నేతలు కౌంటర్ అటాక్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డే క్షుద్ర పూజలు చేస్తున్నారని దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే క్షుద్రపూజలంటూ చిల్లర డ్రామాలు ఆడుతున్నారని దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్ర పూజల వ్యాఖ్యల దుమారం
0
39
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


