రాజమౌళి-మహేశ్ చిత్రం పుకార్లపై విజయేంద్రప్రసాద్ క్లారిటీ

RRR మూవీతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) తదుపరి చిత్రంపై అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu)తో తన తదుపరి చిత్రం అని జక్కన్న ప్రకటించండంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ క్రేజీ ప్రాజెక్టుపై రోజుకో వార్త హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రంలో మహేశ్ పాత్ర హనుమంతుని స్ఫూర్తితో తెరకెక్కనుందనే వార్త కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ గాసిప్స్ పై రాజమౌళి తండ్రి, కథా రచయిత విజయేంద్రప్రసాద్(Vijayendra Prasad) క్లారిటీ ఇచ్చారు.

తన కుమారుడు రాజమౌళికి పౌరాణిక కథలు అంటే చాలా ఇష్టమని.. అందుకే తన చిత్రాలు భారతీయ సంస్కృతికి అనుగుణంగా ఉంటాయన్నారు. మహేశ్(Mahesh Babu) తో చిత్రంలో కూడా ఆ మూలాలు ఉంటాయి.. కానీ హనుమంతుని స్ఫూర్తితో మాత్రం ఉండదని స్పష్టంచేశారు. అవి కేవలం పుకార్లు మాత్రమే అని విజయేంద్రప్రసాద్ తెలిపారు. కాగా ప్రస్తుతం మహేశ్.. త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం అయిపోగానే రాజమౌళి చిత్రంలో నటించనున్నాడు. ఈ చిత్రాన్ని ప్రపంచ స్థాయిలో భారీ బడ్జెట్ తో జక్కన్న తెరకెక్కించనున్నాడు.

Read Also: ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు కార్మికుల పాదయాత్ర
Follow us on:  YoutubeKooGoogle News

Latest Articles

ఫౌజీ వస్తున్నాడు.. మరి.. బాలయ్య..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ, క్రేజీ మూవీ ఫౌజీ. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఇన్ని రోజులు సస్పెన్స్ గా ఉండేది. ఇప్పుడు డిసెంబర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్