‘ది కేరళ స్టోరీ’ సినిమాపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా ‘ది కేరళ స్టోరీ’ సినిమా ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అనేక వివాదాల మధ్య శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. కేరళలోని 32వేల మంది మహిళలు ఇస్లాం మతంలోకి ఎలా మారారనే అంశం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. యువతులను ట్రాప్ చేసి ఐసిస్ ఉగ్రవాద సంస్థలో చేర్చారంటూ తీసిన ఈ సినిమాను నిషేధించాలంటూ కాంగ్రెస్, వామపక్షాలు డిమాండ్ చేస్తుండగా.. బీజేపీ, హిందూ సంస్థలు మాత్రం ఈ చిత్రాన్ని కచ్చితంగా చూడాలని చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ సినిమాకు రాష్ట్రంలో పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. జిహాద్, మత మార్పిడి, తీవ్రవాదం యొక్క భయంకరమైన ముఖాన్ని ఈ చిత్రం బట్టబయలు చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా ఈ చిత్రానికి మొదటి రోజు దేశవ్యాప్తంగా భారీ కలెక్షన్లు వచ్చినట్లు సమాచారం.

Latest Articles

సుకుమార్.. మార్పు కోరుకుంటున్నారా..?

క్రియేటీవ్ జీనియస్ సుకుమార్.. పుష్ప 2 రిలీజై సంవత్సరంన్నర అయినా ఇంత వరుకు కొత్త సినిమాని పట్టాలెక్కించలేదు. త్వరలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో మూవీని స్టార్ట్ చేయడానికి సుకుమార్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్