ఇండియా అమ్మాయి, స్పెయిన్ అబ్బాయి మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి వేదికగా ఘనంగా జరిగింది. స్పెయిన్ లోని బార్సిలోనా పట్టణానికి చెందిన వరుడు మార్క్ మన్ సిల్లాతో సత్తుపల్లి పట్టణానికి చెందిన వధువు లావణ్యతో పెళ్లి జరిగింది. ఈ వివాహ వేడుకకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అతిధిగా హాజర య్యారు. స్పెయిన్లో ఉద్యోగం చేస్తున్న క్రమంలో లావణ్యకు మన్ సిల్లాకు పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారడంతో తమ కుటుంబ సభ్యులకు ప్రేమ వ్యవహారాన్ని తెలియజేసి వారిని ఒప్పించి పెళ్లిపీటలు ఎక్కారు. ఇరు కుటుంబ పెద్దల అంగీకారంతో పెళ్లి వైభవంగా జరిగింది. తెలుగువారి సంప్రదాయం ప్రకారం శాస్త్రోక్తంగా పెళ్లి జరిగింది. దేశాలు, మతాలు వేరైనా తమ ప్రేమకు పచ్చ జెండా ఊపిన తల్లిదండ్రులకు పిల్లలుగా పుట్టటం తమ అదృష్ట మంటూ ఆనందం వ్యక్తం చేసారు లావణ్య – మార్క్ మాన్ సిల్లా లు. వరుడు కుటుంసభ్యులు తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా దుస్తులు ధరించి వివాహ వేడుకలో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, ముఖ్యఅతిధి రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నూతన దంపతులను ఆశీర్వ దించారు.