తమిళనాడు రాజకీయాల్లో కొంతకాలంగా పెనుమార్పులు సంభవిస్తున్నాయి. సహజంగా తమిళనాట ఎప్పుడూ ఎన్నికల గోదాలో రెండు శిబిరాలే తలపడతాయి. అయితే ఈసారి లోక్సభ ఎన్నికల్లో మూడు కూటములు తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల యుద్ధానికి సన్నద్ధమవుతున్న ప్రధాన పార్టీల తీరు తెన్నులపై ఓ లుక్ వేద్దాం.
మూడు కూటముల్లో మొదటిది డీఎంకే – కాంగ్రెస్ కూటమి. డీఎంకే ప్రస్తుతం తమిళనాట అధికారంలో ఉంది. కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమిలో డీఎంకే కూడా భాగస్వామిగా ఉంది. అంతేకాదు కాంగ్రెస్ అధిష్టానంతో డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్కు మంచి సంబంధా లున్నాయి. ఈ నేపథ్యంలో డీఎంకే సాయంతో తమిళనాడులో కూడా కొన్ని సీట్లు సునాయాసంగా గెలుచు కోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. మూడేళ్ల కిందట తమిళనాట అధికారంలోకి వచ్చింది డీఎంకే. ముఖ్య మంత్రిగా ఎంకే స్టాలిన్ రాష్ట్ర పగ్గాలు చేపట్టారు. ఈ మూడేళ్ల కాలంలో స్టాలిన్ కు ముఖ్యమంత్రిగా మంచి మార్కులే పడ్డాయి. లోక్సభ ఎన్నికల్లో అధికార డీఎంకే 21 సీట్లలో పోటీ చేస్తోంది. పొత్తులో భాగంగా కాంగ్రెస్కు తొమ్మిది సీట్లు కేటాయించారు. మిగతా రాజకీయపార్టీలకు ఒక్కో సీటు కేటాయించారు. తాజాగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి డీఎంకే మేనిఫోస్టోను కూడా ప్రకటించింది.
మరోవైపు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పళనిస్వామి నాయకత్వంలోని అన్నా డీఎంకే కూడా ఎన్నికల్లో పోటీ చేస్తోంది. అనూ హ్యంగా విజయ్కాంత్ పార్టీ డీఎండీకే తాజాగా అన్నా డీఎంకేతో జత కట్టింది. డీఎండీకే కు ఐదు సీట్లు ఇవ్వడానికి పళనిస్వామి అంగీకరించారు. అలాగే ఎస్డీపీఐ, పుదియ తమిళగం పార్టీలకు ఒక్కో సీటు కేటాయించారు పళనిస్వామి. 2019లోక్సభ ఎన్నికల్లో డీఎంకే నాయకత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ 38 సీట్లను గెలుచుకుంది. దీంతో ఈసారి కూడా మెజారిటీ సీట్లు తమవే అంటున్నారు డీఎంకే నేతలు. 2019 లోక్సభ ఎన్నికల్లో పళనిస్వామి నాయకత్వం లోని అన్నా డీఎంకేకు కేవలం ఒకే ఒక్క సీటు దక్కింది. కొన్ని నెలల కిందటి వరకు అన్నా డీఎంకే, ఎన్డీయే కూటమిలో ఉండేది. దాదాపు ఏడాదిన్నర కాలంగా బీజేపీ, అన్నా డీఎంకే మధ్య లోలోపల గొడవలు నడుస్తున్నాయి. ఈ గొడవల సంగతి కమలం పార్టీ ఢిల్లీ పెద్దలకు తెలియనిది కాదు. గొడవలు ముదురుతున్నప్పుడల్లా కమలం పార్టీ పెద్దలు జోక్యం చేసుకునేవారు. దీంతో, తాత్కాలికంగా విభేదాలు సమసిపోయేవి. ఆ తరువాత షరామామూలుగా మళ్లీ గొడవలు ప్రారంభమయ్యేవి. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామ లై నోటి దురుసుతనమే దీనికి ప్రధాన కారణం అని ఆరోపించారు అన్నా డీఎంకే నేతలు.చివరకు ఈ గొడవల వ్యవహారం ముదిరి పాకాన పడింది. అంతిమంగా కిందటే డాది ఎన్డీయే కూటమికి పళని స్వామి నాయకత్వంలోని అన్నా డీఎంకే గుడ్బై కొట్టింది. జయలలితకు తామే అసలైన వారసులం అంటున్నారు పళనిస్వామి. జయలలిత అభిమానులంతా లోక్సభ ఎన్నికల్లో తమనే ఆశీర్వది స్తారన్న భరోసాతో ఉన్నారు పళనిస్వామి. తమిళనాడులో నిన్నమొన్నటివరకు భారతీయ జనతా పార్టీకి ప్రత్యేక గుర్తింపు ఉండేది కాదు. ఒకసారి డీఎంకేతో మరోసారి అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంటూ ఇన్నేళ్లూ కాలం గడిపే సింది కమలం పార్టీ. ఎప్పుడూ ఏదో ఒక ద్రవిడ పార్టీకి జూనియర్ పార్ట్నర్గానే కొనసాగింది భారతీ య జనతా పార్టీ.
తమిళనాట బీజేపీకి ఊపిరులూదిన నాయకుడు అన్నామలై అనే చెప్పాలి. అన్నామలై పూర్వా శ్రమంలో ఐపీఎస్ అధికారి. కర్ణాటక క్యాడర్లో పనిచేశాడు. సమర్థుడైన పోలీసు అధికారిగా జనంలో గుడ్విల్ తెచ్చుకున్నాడు. తమిళ నాట బీజేపీకి దిక్కుమొక్కులేని రోజుల్లో 2021 జులైలో పార్టీ రాష్ట్ర బాధ్యతలు అన్నామలైకు అప్పగించారు హస్తిన పెద్దలు. అన్నామలై పగ్గాలు చేపట్టిన తరువాత తమిళ నాడు బీజేపీలో జోష్ పెరిగిన మాట వాస్తవం. తమిళనాట కొన్ని దశాబ్దాలుగా ఏదో ఒక ద్రవిడ పార్టీకి జూనియర్ పార్టీగా ఉన్న బీజేపీని ఒక స్వతంత్ర రాజకీయపార్టీగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి తీసుకెళ్లిన ఘనత నిస్సందేహంగా అన్నామలైదే. ఎంకే స్టాలిన్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రతిరోజూ ఏదో ఒక ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టి బీజేపీని జనంలోకి తీసుకెళ్లాడు అన్నామలై. ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తున్నారు డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్. అలాగే వరదలు సంభ వించిన చెన్నై, ట్యుటీకోరన్ ప్రాంతాలకు ప్రత్యేక సాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించ డాన్ని కూడా ఎన్నికల ప్రచారం ఒక అస్త్రంగా మలుచుకుంటున్నారు స్టాలిన్. ఇదిలా ఉంటే ఇటీవల స్టాలిన్ క్యాబినెట్లోని పలువురు మంత్రులపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ అంశాన్ని బీజేపీ నేత అన్నామలై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. డీఎంకే సర్కార్ అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారిందని ఘాటు ఆరోపణలు చేస్తున్నారు అన్నామలై. దీంతోపాటు అయోధ్య అంశం, ప్రధాని నరేంద్ర మోడీ ఇమేజ్ తమకు ప్లస్ పాయింట్లు అవుతాయని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. ఇదిలా ఉంటే తమిళనాడు లోని మొత్తం 39 నియోజకవర్గాలకు ఏప్రిల్ 19న ఒకేసారి పోలింగ్ నిర్వహించ నున్నారు.