Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

బీహార్ లో రంజుగా మారుతున్న రాజకీయం

    బీహార్‌ మహాఘట్‌బంధన్‌లో సీట్ల కేటాయింపు ఒక కొలిక్కి వచ్చింది. జాతీయ పార్టీ కాంగ్రెస్ అలాగే లాలూ ప్రసాద్ యాదవ్ నాయకత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ మధ్య కొంతకాలంగా విభేదాలున్నాయి. అయితే ఇటీవల ఈ విభేదాలకు తెరపడింది. చర్చోపచర్చల తరువాత ఈ విభేదాలకు తెరపడింది. కాంగ్రెస్ – ఆర్జేడీ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం మొత్తం 40 లోక్‌సభ సీట్లలో రాష్ట్రీయ జనతాదళ్ 26 సీట్లలో పోటీ చేస్తుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ తొమ్మిది సెగ్మెంట్లలో పోటీ చేస్తుంది. ఐదు నియోజక వర్గాలను ఇతర పార్టీలకు కేటాయించారు. తొలివిడతలో భాగంగా ఏప్రిల్ తొమ్మిదిన బీహార్‌లోని నాలుగు సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి.

విపక్షాల మహాఘట్‌బంధన్‌లో నిన్న మొన్నటివరకు తీవ్ర విభేదాలు నడిచాయి. ప్రధానంగా కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ మధ్య విభేదాలు తలెత్తాయి. సీట్ల కేటాయింపుపై రెండు పార్టీల అధినేతలు ఎటు వంటి నిర్ణయం తీసుకోకముందే 13 సీట్లకు ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించింది రాష్ట్రీయ జనతాదళ్. ఇందులో ఏప్రిల్ 19న జరగనున్న నాలుగు సీట్లకు కూడా అభ్యర్థులను ప్రకటించింది ఆర్జేడీ నాయక త్వం. ఔరంగాబాద్‌ నుంచి అభయ్ కుష్వాహా, నవాడా నుంచి శ్రావణ్‌ కుష్వాహా, గయ నుంచి కుమార్ సర్వజిత్‌ చివరగా జమూయ్ సెగ్మెంట్‌ నుంచి అర్చనా రవిదాస్‌ పేర్లను ప్రకటించింది రాష్ట్రీయ జనతాదళ్. కాగా ఆర్జేడీ వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. సీట్ల కేటాయింపు ఒక కొలిక్కిరాకముందే ఏకపక్షంగా అభ్యర్థులను ఎలా ప్రకటిస్తారని బీహార్ కాంగ్రెస్ సీనియర్ నేత నిఖిల్ కుమార్ ప్రశ్నించారు. పొత్తు ధర్మాన్ని రాష్ట్రీయ జనతాదళ్ అటకెక్కించిందని ఆయన నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా తీరు మార్చుకోవాలని రాష్ట్రీయ జనతాదళ్ అగ్రనాయకత్వాన్ని ఆయన సున్నితంగా మందలించారు. ఆర్జేడీ భవిష్యత్తులో కూడా ఇలాగే ప్రవర్తిస్తే మహాఘట్‌బంధన్ విచ్ఛిన్నం అవుతుందని నిఖిల్ కుమార్ హెచ్చరించారు. ఇదే జరిగితే కాంగ్రెస్ కంటే రాష్ట్రీయ జనతాదళ్ ఎక్కువగా నష్టపో తుందని ఆయన పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ పట్ల రాష్ట్రీయ జనతాదళ్ నారాజ్ కావడానికి పప్పు యాదవ్ ఒక కారణం అంటున్నారు రాజకీయ పరిశీలకులు. పప్పు యాదవ్ చిన్నా చితకా నాయకుడు కాదు. బీహార్ నుంచి ఐదు సార్లు ఎంపీగా వ్యవహరించిన నాయకుడు. పప్పు యాదవ్ గతంలో రాష్ట్రీయ జనతాదళ్ లో పనిచేశారు. ఆర్జేడీలో ఉన్నప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ విధానాలను పప్పు యాదవ్ తీవ్రంగా విమర్శించేవారు. ఒక్కమాటలో చెప్పాలంటే లాలూ యాదవ్‌పై పప్పు యాదవ్ రాజకీయ యుద్ధం చేశారనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో 2015లో రాష్ట్రీయ జనతాదళ్ నుంచి పప్పు యాదవ్‌ను బహిష్కరించారు లాలూ ప్రసాద్ యాదవ్. ఆ తరువాత జన్ అధికార్ పార్టీ పేరుతో పప్పు యాదవ్ స్వంత పార్టీ పెట్టుకున్నారు. ఇటీవల జన్ అధికార్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు పప్పు యాదవ్. అయితే పప్పు యాదవ్‌ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కావడం రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు మింగుడపడలేదంటారు రాజకీయ విశ్లేషకులు.

బీహార్‌వరకు బీజేపీ నాయకత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ దూకుడు మీద ఉంది. ఎన్డీయే కూటమిలో సీట్ల కేటాయింపు కూడా ఒక కొలిక్కి వచ్చింది. పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీ 17 సెగ్మెంట్లలో పోటీ చేస్తోంది. కాగా నితీశ్ కుమార్ నాయకత్వంలోని జనతాదళ్‌ యునైటెడ్ 16 సీట్లలో పోటీకి అంగీకరించింది. అలాగే రామ్‌ విలాస్ వర్గానికి చెందిన లోక్‌ జనశక్తి పార్టీకి ఐదు నియోజకవర్గాలు కేటాయించారు. మిగతా రెండు సెగ్మెంట్లను ఇతర భాగస్వామ్యపక్షాలకు కేటాయించారు. కాగా ఎన్డీయే కూటమిలో భాగస్వామ్యపక్షంగా ఉన్న లోక్‌ జనశక్తి తరఫున ఆ పార్టీ సీనియర్ నేత చిరాగ్ పాశ్వన్ హాజీపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఎన్డీయే కూటమిలోని మరో భాగస్వామ్య పక్షమైన పశుపతి పరాస్ నాయకత్వంలోని లోక్‌ జనశక్తి పార్టీకి ఎక్కడా సీటు కేటాయించలేదు. దీంతో పశుపతి పరాస్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. కేంద్ర మంత్రిపదవికి కూడా పశుపతి పరాస్ రాజీనామా చేశారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 40 సెగ్మెంట్లలో 39 సెగ్మెంట్లను ఎన్డీయే కూటమి కైవసం చేసుకుంది. ఒకే ఒక్క సీటును కాంగ్రెస్‌ గెలుచుకుంది. ఈసారి కూడా మెజారిటీ సీట్లు తామే గెలుచుకుంటామంటు న్నారు ఎన్డీయే కూటమి నేతలు. ఇదిలాఉంటే నిన్న మొన్నటివరకు ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉన్న జనతాదళ్ యునైటెడ్ పార్టీ రాజకీయంగా యూ టర్న్ తీసుకోవడం మెజారిటీ బీహార్ ప్రజలకు మింగుడు పడడం లేదన్న వార్తలు వస్తున్నాయి. ఇండియా కూటమికి గుడ్‌బై కొట్టిన నితీశ్‌ కుమార్ వెనువెంటనే భారతీయ జనతా పార్టీ శిబిరంలో చేరారు. బీజేపీ అండతో తొమ్మిదోసారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. దీంతో నితీశ్ కుమార్‌కు అవకాశవాది అనే ముద్ర పడింది. నితీశ్ కుమార్ కూటమి మారిన తీరు ఎన్డీయే కూటమికి మైనస్ పాయింట్ అవుతుందని ఒక వర్గం భావిస్తోంది. ఇదిలా ఉంటే యాదవ సామాజికవర్గాన్ని ప్రసన్నం చేసుకోవడానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్‌ సేవలను ఉపయోగించుకోవాలని భారతీయ జనతా పార్టీ భావిస్తున్నట్లు పాట్నా రాజకీయ వర్గాల సమాచారం. కొన్ని నెలల కిందట జరిగిన మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ గెలు పొందింది. మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కమలం పార్టీ గెలుపొందిన వెంటనే మరోసారి ముఖ్య మంత్రి కుర్చీ ఎక్కాలని శివరాజ్  సింగ్ చౌహాన్ ఉవ్విళ్లూరారు. అలాగే వసుంధరా రాజే, ప్రహ్లాద్ సింగ్ పటేల్, మహంత్ బాలక్‌నాథ్ కూడా ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడ్డారు. అయితే వీరందరినీ పక్కన పెట్టి మోహన్ యాదవ్ మెడలో జయమాల వేశారు ప్రధాని నరేంద్ర మోడీ.

లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లోని యాదవ సామాజికవర్గాన్ని ప్రసన్నం చేసుకోవడానికే మోహన్ యాదవ్‌ను ముఖ్యమంత్రిగా ప్రధాని నరేంద్ర మోడీ ఎంపిక చేశారని అప్పట్లోనే రాజకీయ పండితులు పరిస్థితిని విశ్లేషించారు. బీహార్‌లో ఇప్పటికీ మెజారిటీ యాదవులు, లాలూ ప్రసాద్‌ నాయకత్వాన్ని బలపరుస్తున్నట్లు చెబుతారు రాజకీయ పండితులు. అయితే మోహన్ యాదవ్ బీహార్‌లో ప్రచారం చేస్తే యాదవ సామాజిక వర్గంపై ఆ ప్రభావం ఉంటుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏమైనా బీహార్ రాష్ట్రంపై భారతీయ జనతా పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇదిలా ఉంటే ఈసారి లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీహార్‌కు ఒక ప్రత్యేకత ఉంది. మొత్తం ఏడు దశల్లో బీహార్ ఎన్నికలు జరగబోతున్నాయి.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్