గుంటూరు పట్టణం కృష్ణ బాబు కాలనీలో రెండు వర్గాల మధ్య గొడవ ఉద్రిక్తతలకు దారి తీసింది. దాదాపుగా 30 మంది యువకులు బాహాబాహీకి దిగారు. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయ పడ్డారు. గాయపడిన వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆస్పత్రిలో కూడా ఇరు వర్గాలుకు గొడవకు దిగాయి. ఆస్పత్రిలోనే ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. దీంతో ఆస్పత్రి సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు .. ఆస్పత్రికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు.