కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR విమర్శించారు. తొమ్మిదిన్నరేళ్లు రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం రయ్ రయ్మని ఉరికిందని, కాంగ్రెస్ అధికారం చేపట్టిన ఏడాదిలోనే నై.. నై.. అంటున్నదని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. KCR పాలనలో రియల్ భూమ్ ఎలా ఉండేదని, కాంగ్రెస్ పాలనలో ఎందుకు ఆగిపోయిందని ప్రశ్నించారు. కేవలం పరిపాలన దక్షత లోపం, విజన్ లేని పాలనా విధానంతోనే ఆదాయం పడిపోయిందని చెప్పారు. హైడ్రాతో తెలంగాణ ఆదాయానికి జీవధార అయిన రియల్ రంగంపై వేటు పడిందని, ముందు చూపులేని నిర్ణయాలతో రాష్ట్ర ఆదాయానికి పోటు పడిందని కేటీఆర్ విమర్శించారు.
పిచ్చోడి చేతిలో రాయిలా మారిన తెలంగాణ – కేటీఆర్
0
164
Previous article
Next article
Latest Articles
2027 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్ల జోరు
2027 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్ల జోరు కొనసాగింది. నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.6.51 లక్షల కోట్లు కాగా... ఇది గతేడాదితో పోలిస్తే 16.4 శాతం వృద్ధి రేటు నమోదైంది....
- Advertisement -
- Advertisement -


