39.2 C
Hyderabad
Tuesday, April 16, 2024
spot_img

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద వైఎస్ షర్మిల అరెస్ట్

YSRTP అధ్యక్షురాలు షర్మిల(Sharmila) ఢిల్లీలో అరెస్ట్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఛలో పార్లమెంట్‌కు ఆమె పిలుపునిచ్చారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న కారణంగా ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినా కానీ ఆమె ర్యాలీకి సిద్ధమవ్వడంతో జంతర్ మంతర్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం పార్లమెంట్ పోలీస్ స్టేషన్‌కు షర్మిలను తరలించారు. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. కాగా కేసీఆర్ ప్రభుత్వంలోని అవినీతిపై చర్యలు తీసుకోవాలని కొంతకాలంనగా షర్మిల డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర పెద్దలను కూడా కలిసి దీనిపై ఫిర్యాదుచేశారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులోని అవినీతిపై విచారణ చేపట్టాలని ఢిల్లీ వెళ్లి సీబీఐకి కూడా పలుమార్లు ఫిర్యాదులు చేశారు.

Read Also: హృదయవిదారకం.. ప్లాస్టిక్ డ్రమ్ లో మహిళ శవం

Follow us on:   Youtube   Instagram

Latest Articles

రాయదుర్గంలో టీడీపీ ఎన్నికల ప్రచారం

     అనంతపురం జిల్లా రాయదుర్గం ఎన్నికల ప్రచారంలో..వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అభ్యర్థి కాలువ శ్రీనివాసులు మండిప డ్డారు. జగన్‌ ఐదేళ్ల పాలనలో ఏపీ సర్వనాశనం అయిందని విమర్శించారు. అదే విధంగా ప్రజలు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్