నేటి నుంచి తెలంగాణ బీజేపీ దరఖాస్తుల స్వీకరణ..!

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ అభ్యర్థుల దరఖాస్తు స్వీకరణ మొదలైంది. ఆశావహుల నుంచి దరఖాస్తులకు  రాష్ట్ర బీజేపీ ఆహ్వానం పలికింది. ఇందుకోసం హైదరాబాద్‌ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేశారు. మొత్తం మూడు పేజీలతో కూడా ఫారమ్‌ సమర్పించాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫారంలో నాలుగు పార్ట్‌లు ఉన్నాయి. మొదటి పార్ట్‌లో బీజేపీలో ఎప్పుడు చేరారు?.. వ్యక్తిగత వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. పార్ట్‌-2లో ఎక్కడి నుంచి పోటీ చేశారనే విషయం ప్రస్తావించాలి. పార్ట్‌-3లో ప్రస్తుతం పార్టీలో నిర్వహిస్తున్న బాధ్యతలను పేర్కొనాలి. ఇక పార్ట్‌4లో క్రిమినల్‌ కేసులేమైనా ఉంటే.. ఆ వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది.

తొలి దరఖాస్తును సికింద్రాబాద్ నుంచి రవి ప్రసాద్ గౌడ్ అందజేశారు. అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణలో కౌంటర్ ఇంచార్జీలుగా   మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి, జీఎచ్ఎంసి మాజీ డిప్యూటీ మేయర్  సుభాష్ చందర్, మల్లేష్ తదితరులు ఉన్నారు. ఇవాళ సాయంత్రం నాలుగు గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. చివరి తేదీని సెప్టెంబర్‌ 10వ తేదీగా తెలంగాణ బీజేపీ నిర్ణయిచింది.

Latest Articles

విజయవాడలో మరోసారి డయేరియా కలకలం..20 మంది తీవ్ర అస్వస్థత

విజయవాడలో మరోసారి డయేరియా కలకలం రేగింది. గిరిపురంలో 20 మంది తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు. తాగునీటి పైప్‌లైన్ లీక్ కావడంతో డయేరియా ప్రబలింది. గిరిపురంలో డయేరియా ప్రాంతాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్