అనంతపురం జిల్లాలో టీడీపీకి షాక్ తగిలింది. కళ్యాణదుర్గం టికెట్ ఆశించి భంగపడ్డ ఉమా మహే శ్వర్ నాయుడు టీడీపీని వీడారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. కండువా కప్పి ఉమామహే శ్వర్ నాయుడిని పార్టీలోకి ఆహ్వానించారు జగన్. కళ్యాణ్దుర్గం నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా సురేం ద్రబాబును ప్రకటించింది. దీంతో మనస్తాపానికి గురైన ఉమామహేశ్వర నాయుడు కొద్ది కాలంగా అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. నిన్న మాదినేని ఉమా మహేశ్వర నాయుడు ఇంటికి.. కళ్యాణదుర్గం వైసీపీ అభ్యర్థి ఎంపీ తలారి రంగయ్య, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఇతర వైసిపి నేతలు వెళ్లారు. ఉమా మహేశ్వర నాయుడుని వైసిపిలోకి రావాలని ఆహ్వానిం చారు.