ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో టచ్లో ఉన్నారన్న మంత్రి కోమటిరెడ్డి కామెంట్స్కు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీజేపీ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూలడం ఖాయమన్నారు. తాము గేట్లు తెరిస్తే 48 గంటల్లో కాంగ్రెస్ సర్కార్ ఉండదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. షిండే పాత్ర పోషిస్తానని.. గతంలో గడ్కరీతో కోమటిరెడ్డి అన్నది నిజమా కాదా అని ప్రశ్నించారు. తమ్ముడి భార్యకు వెంకట్ రెడ్డి టికెట్ రాకుండా చేశారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి వసూళ్ల చిట్టా తమ దగ్గర ఉందని ఏలేటి బాంబు పేల్చారు. హైదరాబాద్ డబ్బులను దేశ రాజకీయాల కోసం కాంగ్రెస్ విని యోగిస్తుందని ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆరోపించారు.