సీనియర్ నేత డి.శ్రీనివాస్ పెద్ద కుమారుడు, నిజామాబాద్ మాజీ మేయర్ సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మా నాన్న డిఎస్ కు ప్రాణహాని ఉందని హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం మా నాన్న పరిస్థితి ఏంటో తెలియడం లేదని.. ఆయన గురించి ఆందోళనగా ఉందన్నారు. డిఎస్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు రాసిన లేఖంతా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కనుసన్నల్లోనే జరిగిందని ఆయన ఆరోపించారు. అరవింద్ కి ఎవరో సహకరిస్తున్నారని.. వాళ్లు పద్ధతి మార్చకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో తెలుస్తోందని సంజయ్ వ్యాఖ్యానించారు.
Read Also: మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్పకు అరెస్ట్ వారెంట్ జారీ
Follow us on: Youtube , Instagram