గాజు గ్లాస్ ఛాంబర్తో కూడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణించడం ప్రమాదకరమని రవాణా శాఖ స్పష్టం చేసింది. గత రెండు రోజులుగా ఇటువంటి బస్సులను మూడింటిని సీజ్ చేశారు రవాణా శాఖా అధికారులు. ప్రయాణీకులు సైతం ఇటువంటి బస్సులలో ప్రయాణిస్తే ప్రమాదానికి లోనయ్యే అవకాశముంటుందని రవాణా శాఖ తెలిపింది. ప్రమాద సందర్భంలో గాజు గ్లాస్ క్యాబిన్ల వల్ల ప్రయాణికులు ప్రాణాలకు ముప్పు ఉందని ఆర్టీఏ అధికారులు తెలిపారు. ఇటువంటి బస్సులు సీజ్ చేసినప్పుడు ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేసే బాధ్యత ఆ యా యాజమాన్యాలదేనని రవాణా శాఖ స్పష్టం చేసింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు వరుస అగ్ని ప్రమాదాలకు గురవుతున్న సందర్బం గా వాటిపై తనిఖీలు ముమ్మరం చేశారు అధికారులు. నిబంధనలకు విరుద్దంగా ఉండే బస్సులు, యాజమాన్యాల మీద కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ స్పష్టం చేసింది.
గాజు గ్లాస్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ఆర్టీఏ తనిఖీలు
0
53
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


